Share News

CM Revanth Reddy: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Jun 07 , 2025 | 10:23 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారికి వైద్యం అందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy: మరోసారి గొప్ప మనసు చాటుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వినికిడి లోపం ఉన్న చిన్నారి లిఖితకు (Likitha) పూర్తి ఉచిత వైద్యం అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వినికిడి లోపం కారణంగా బాధపడుతున్న నాలుగేళ్ల నేతావత్ లిఖితా శ్రీకి తక్షణం ప్రభుత్వ ఈఎన్టీ ఆస్పత్రిలో పూర్తిగా ఉచితంగా కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.


నలుగురు పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ పాపకు వినికిడి లోపం శాపంగా మారింది. ఎవరూ ఏం చెబుతున్నారో కూడా అర్థం కాక అమాయకంగా అలాగే ఉండిపోతోంది. ఆ పాపలో వినికిడి లోపాన్ని గుర్తించిన తర్వాత తల్లిదండ్రులు చికిత్స కోసం ఎంతోమంది వైద్యులను సంప్రదించారు. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ తప్పనిసరని చెప్పడంతో అందుకు అవసరమయ్యే ఖర్చును భరించే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి రాగానే వెంటనే మానవత్వంతో స్పందించారు. త్వరగా ఆ పాపకు అవసరమైన పూర్తి వైద్యం ఉచితంగా అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైన చికిత్స జరిగి లిఖిత పూర్తిగా కోలుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.


ఈ వార్తలు కూడా చదవండి

రాజన్న కోడెలపై రాజకీయం వద్దు: సురేఖ

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన : డీకే అరుణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 10:42 AM