TG NEWS: మాగంటి గోపీనాథ్కి ఆస్పత్రిలో చికిత్స.. బీఆర్ఎస్ నేతలు ఏమన్నారంటే..
ABN , Publish Date - Jun 05 , 2025 | 08:11 PM
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏఐజీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్కి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) ఇవాళ(గురువారం) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఏఐజీ హాస్పిటల్కి ఆయనను కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్కి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Kukatpally MLA Madhavaram Krishna Rao) స్పందించారు. మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు ముందు తనకి ఫోన్ కాల్ చేశారని తెలిపారు.
ఇవాళ(గురువారం) మాధవరం కృష్ణారావు మీడియాతో మాట్లాడారు. తన కుడి భుజమైన సర్దార్ని కోల్పోయానని మాగంటి గోపీనాథ్ తనకి చెప్పారని మాధవరం కృష్ణారావు అన్నారు. సర్దార్ చనిపోయినప్పటి నుంచి ఆయన తీవ్ర మనస్థాపనలో ఉన్నారన్నారు. తన కుడి భుజాన్ని కోల్పోయానని అంటూ తనకి పదేపదే ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. పోలీసులకు ఎన్నిసార్లు కాల్ చేసినా పట్టించుకోలేదని ఆవేదన చెందారని అన్నారు. స్థానిక కార్పొరేటర్ బాబాఫసీయుద్దీన్పై చర్యలు తీసుకోవాలని చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారని మాధవరం కృష్ణారావు తెలిపారు.
సర్దార్ చనిపోయాడనే ఆవేదనలోనే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని మాధవరం కృష్ణారావు తెలిపారు. గుండె, కిడ్నీ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్నారని అన్నారు. మాగంటికి గుండె సంబంధిత డాక్టర్లు, కిడ్నీ సంబంధిత డాక్టర్లు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాలని మాగంటి కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారని అన్నారు. మాగంటి గోపీనాథ్పై బయట వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు.
మాగంటికి వెంటిలేటర్పై చికిత్స: దాసోజ్ శ్రవణ్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ (Dasoju Sravan) తెలిపారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అన్నారు. 48 గంటల పాటు మాగంటి గోపీనాథ్ని వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచారని చెప్పారు. ఇటీవల బీఆర్ఎస్ నేత సర్దార్ మృతి చెందడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారని తెలిపారు. తన కుడి భుజాన్ని కోల్పోయానంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకి పదిసార్లు కాల్ చేసి గోపీనాథ్ మాట్లాడారని దాసోజ్ శ్రవణ్ అన్నారు. ఇవాళ(గురువారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో దాసోజ్ శ్రవణ్ మాట్లాడారు.
స్థానిక కార్పొరేటర్ బాబాఫసీయుద్దీన్ వల్ల సర్దార్ చనిపోయాడని ఆందోళన చెందారని దాసోజ్ శ్రవణ్ తెలిపారు. పోలీసులకు ఎన్నిసార్లు కాల్ చేసినా పట్టించుకోవడం లేదని మాగంటి గోపీనాథ్ మనస్థాపం చెందారని.. దీంతో రెండు రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారన్నారు. ఇవాళ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుప్ప కూలి కింద పడిపోయారని చెప్పారు. వెంటనే ఏఐజీ హాస్పిటల్కు తరలించారని తెలిపారు. ఏఐజీ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని దాసోజ్ శ్రవణ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News