Home » Maganti Gopinath
KCR: మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యలను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. గోపీనాథ్ భౌతికకాయాన్ని చూసి విలపించారు. గంభీరమైన వ్యక్తిత్వంతో కనిపించే ఆయన కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్కు చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి అకాల మృతిపట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు.
Nara Lokesh: జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చిన ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి మాగంటి భౌతికాయానికి నివాళులర్పించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమని అన్నారు.
CM Chandrababu: జూబ్లీహిల్స్లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నట్లు సమాచారం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ మరికాసేట్లో రానున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పించనున్నారు. కాగా గోపీనాథ్ నివాసంలోనే కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు.
Maganti Gopinath funeral: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంతిమ సంస్కారాలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. మరోవైపు ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్ధి దేహాన్ని మాదాపూర్ కావూరి హిల్స్లోని మాగంటి నివాసానికి తరలించారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం ఉంచారు. ఆస్పత్రి నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని ఇంటికి కుటుంబ సభ్యులు తరలించనున్నారు.
Condolences: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏఐజీ ఆసుపత్రిలో చేరిన గోపీనాథ్ చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని అన్నారు.
KCR condolences: బీఆర్ఎస్ సీనియర్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. సంతాపం ప్రకటించారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు అని అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) కన్నుమూశారు (Death). ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు.ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, హైదరాబాద్ బీఆర్ఎస్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్కు వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతోంది. వైద్యానికి ఆయన శరీరం స్పందిస్తోందని సన్నిహితులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా ఛాతీలో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.