SRH vs RCB: ఆర్సీబీకి బీసీసీఐ షాక్.. ఎస్ఆర్హెచ్నూ వదలని బోర్డు!
ABN , Publish Date - May 24 , 2025 | 03:05 PM
సన్రైజర్స్ చేతుల్లో ఊహించని రీతిలో పరాజయం పాలైంది ఆర్సీబీ. 42 పరుగుల తేడాతో ఓడిన కోహ్లీ జట్టు.. క్వాలిఫయర్ కష్టాలు కొనితెచ్చుకుంది. ఈ తరుణంలో ఆ టీమ్కు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది.

ఐపీఎల్-2025లో బ్రేకుల్లేని బుల్డోజర్లా దూసుకెళ్తున్న ఆర్సీబీ జోరుకు సన్రైజర్స్ హైదరాబాద్ బ్రేకులు వేసింది. ఈ రెండు జట్ల నడుమ శుక్రవారం జరిగిన పోరులో ఎస్ఆర్హెచ్ 42 పరుగుల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయిన బెంగళూరు.. ఆరెంజ్ ఆర్మీని ఓడించి పాయింట్స్ టేబుల్లో టాప్-2లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని అనుకుంది. కానీ కమిన్స్ సేన దూకుడు ముందు కోహ్లీ టీమ్ నిలవలేకపోయింది. ఈ ఓటమితో ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది ఆర్సీబీ. టాప్-2లో నిలిచే అవకాశాలు తగ్గడంతో క్వాలిఫయర్కు బదులు ఎలిమినేటర్లో ఆడాల్సి వస్తుందేమోనని ఆ జట్టు ఆందోళన పడుతోంది. ఈ తరుణంలో బెంగళూరుకు బిగ్ షాక్ ఇచ్చింది భారత క్రికెట్ బోర్డు.
చెల్లించాల్సిందే..
ఓటమి బాధలో ఉన్న ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు సారథి రజత్ పాటిదార్కు రూ.24 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. సన్రైజర్స్తో మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో పాటిదార్కు ఫైన్ వేసింది బోర్డు. ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ మీద జరిమానా పడటం ఇది రెండోసారి. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన పాటిదార్.. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు. అయినా తాత్కాలిక సారథి జితేష్ శర్మకు కాకుండా పాటిదార్కు జరిమానా విధించింది బీసీసీఐ. ప్లేయింగ్ ఎలెవన్లోని ప్రతి ఆటగాడు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో నుంచి 25 శాతం మొత్తాన్ని ఫైన్ కింద కట్టాల్సి ఉంటుంది. మ్యాచ్ ఫీజు లేదా రూ.6 లక్షలు.. ఇందులో ఏ మొత్తం తక్కువగా ఉంటే దాన్ని బీసీసీఐకి ఆటగాళ్లు చెల్లించాలి. ఇటు ఓడిన జట్టు ఆర్సీబీతో పాటు అటు ఊరట విజయాన్ని అందుకున్న సన్రైజర్స్నూ బోర్డు వదల్లేదు.
కమిన్స్కూ తప్పని షాక్!
ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు రూ.12 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో సన్రైజర్స్ కూడా నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 నేరం కింద అతడికి ఫైన్ వేసింది బోర్డు. ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా అటు ఆర్సీబీ, ఇటు సన్రైజర్స్ రెండూ జరిమానాను ఎదుర్కొన్నాయి. కాగా, ఈ మ్యాచ్లో ఓడిన బెంగళూరు.. పాయింట్స్ టేబుల్ను టాప్-2తో ఫినిష్ చేయడం కష్టంగా మారింది. క్వాలిఫయర్స్లో ఆడాలంటే ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ మీద తప్పక నెగ్గాల్సిన పరిస్థితుల్లో ఉంది ఆర్సీబీ. అదే సమయంలో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల గెలుపోటముల మీద కూడా ఆధారపడాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి:
కోహ్లీ రిటైర్మెంట్పై బీసీసీఐ రియాక్షన్
ఫైనల్ టెన్షన్.. ఆర్సీబీ ఎన్ని గెలవాలంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి