Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్పై బీసీసీఐ రియాక్షన్! అప్పుడే చెప్పాడంటూ..
ABN , Publish Date - May 24 , 2025 | 02:41 PM
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై భారత క్రికెట్ బోర్డు స్పందించింది. టెస్టుల నుంచి తప్పుకునే విషయాన్ని విరాట్ అప్పుడే చెప్పాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. ఆయన ఇంకా ఏమన్నాడంటే..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్బై చెప్పడంపై ఇటీవలే హెడ్ కోచ్ గౌతం గంభీర్ స్పందించాడు. ఒక ఆటగాడు ఎప్పుడు రిటైర్ అవ్వాలనేది ఎవరూ నిర్ణయించలేరని, ఈ విషయంలో ప్లేయర్లదే ఫైనల్ డెసిషన్ అని అన్నాడు. తాజాగా విరాట్ నిష్క్రమణ గురించి భారత క్రికెట్ బోర్డు రియాక్ట్ అయింది. ఇంగ్లండ్ టూర్లో పాల్గొనే భారత జట్టును శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కోహ్లీ రిటైర్మెంట్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటానని ఏప్రిల్ నెలలో విరాట్ తమకు సమాచారం అందించాడని అగార్కర్ అన్నాడు. రిటైర్ అవ్వాలని తాను డిసైడ్ అయ్యానని అతడు చెప్పాడని తెలిపాడు. రోహిత్ శర్మ రిటైర్ అవడానికి చాలా ముందు నుంచే భవిష్యత్తు సారథ్యం గురించి తాము తీవ్రంగా సమాలోచనలు చేసినట్లు అగార్కర్ పేర్కొన్నాడు.
అతడే కరెక్ట్!
ఏడాది కాలంగా శుబ్మన్ గిల్ను నిశితంగా గమనిస్తున్నామని, లీడర్షిప్కు అతడే సరైనోడని తాము భావించామన్నాడు అగార్కర్. జట్టును విజయవంతంగా ముందుకు నడిపించే సామర్థ్యం అతడికి ఉందని తాము నమ్మామని తెలిపాడు. భారత జట్టును నడిపించడం అనేది తీవ్ర ఒత్తిడితో కూడిన జాబ్ అని.. అయితే గిల్కు ఆ సత్తా ఉందన్నాడు చీఫ్ సెలెక్టర్. తనకు అప్పజెప్పిన బాధ్యతల్ని అతడు నెరవేరుస్తాడనే నమ్మకం ఉందన్నాడు. ఇంగ్లండ్ టూర్కు పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయకపోవడం మీదా అగార్కర్ స్పందించాడు. పనిభారం కారణంగా అతడ్ని సెలెక్ట్ చేయలేదని తెలిపాడు. ఈ సిరీస్లో షమి తప్పకుండా ఆడతాడని తాము భావించామని, కానీ అతడు అందుబాటులో లేకుండా పోయాడని అగార్కర్ స్పష్టం చేశాడు. అతడు పూర్తి ఫిట్నెస్ సాధించలేదని వివరించాడు.
ఇవీ చదవండి:
ఫైనల్ టెన్షన్.. ఆర్సీబీ ఎన్ని గెలవాలంటే..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి