Home » Virat Kohli
భారత్ వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు త్వరలో బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ లో వారి కేటగిరీని మార్చనున్నారని తెలుస్తుంది. అదే జరిగితే వారి జీతంలో రూ.2 కోట్లు తగ్గనుంది.
దక్షిణాఫ్రికాతో సిరీస్లో విజృంభించిన కింగ్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నెం.2 స్థానంలోకి దూసుకెళ్లాడు. ఆ సిరీస్లో 302 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన కోహ్లీ తన ర్యాంక్ను రెండు స్థానాల మెరుగుపరుచుకున్నాడు.
రానున్న వన్డే ప్రపంచ కప్లో రో-కోలను ఆడించాలని టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ యాజమాన్యానికి సూచించాడు. వారు అద్భుతమైన ఫామ్లో ఉన్నారని.. వారి కంటే మెరుగైన ఆటగాళ్లు లేరని వెల్లడించాడు.
ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఓపెనింగ్ చేస్తున్న వారితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలని.. తాము కొన్ని సార్లు మాట్లాడుకోలేదని తెలిపాడు.
టీమిండియా వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, వీరిద్దరూ ప్రస్తుతం వన్డే క్రికెట్లో అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. తాజాగా, భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రో-కోపై ప్రశంసలు కురిపించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను కైవసం చేసుకున్న తర్వాత భారత్ ప్లేయర్లు సరదగా గడిపారు. డ్రెస్సింగ్ రూమ్ లో సెటైర్లు వేసుకుంటూ సందడి చేశారు. ఈ క్రమంలో స్టార్ ప్లేయర్ కోహ్లీ.. స్పిన్నర్ కుల్దీప్ పై ఫన్నీ కామెంట్స్ చేశాడు.
పూమాతో ఒప్పందం రద్దు చేసుకున్న విరాట్ కోహ్లీ కొత్తగా అజిలిటాస్కు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. గతంలోనే రూ.40 కోట్లు పెట్టుబడి పెట్టిన కోహ్లీ, వన్8 ఉత్పత్తులను అజిలిటాస్ ద్వారా మార్కెట్లోకి తీసుకురానున్నాడు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ అర్ష్దీప్ సింగ్ చేసిన రీల్ సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఒక్క రోజులోనే ఈ రీల్ 10 కోట్ల వ్యూస్ అందుకోవడం విశేషం.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశముందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కెరీర్ను కొనసాగించే సత్తా కోహ్లీకి ఉందన్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించడమే కాకుండా 2-1 తేడాతో వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.