Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు అస్వస్థత
ABN , Publish Date - Jun 05 , 2025 | 04:35 PM
తెలంగాణ మంత్రి కొండా సురేఖ గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి కళ్లు తిరిగి పడిపోయారు. ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో పడిపోయారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Telangana Minister Konda Surekha) గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో మంత్రి కళ్లు తిరిగి పడిపోయారు. ఈరోజు ఉదయం నుంచి ఆహారం తీసుకోకపోవడంతో ఆమె పడిపోయారు. ఏమి తినకపోవడంతోనే మంత్రికి షుగర్ లెవెల్స్ పెరిగాయి. వెంటనే మంత్రి సురేఖ వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంత్రి సురేఖకు వ్యక్తిగత సిబ్బంది ఆహారం తెచ్చిఇచ్చారు. ఆహారం తీసుకోవడంతో మళ్లీ తేరుకున్నారు కొండా సురేఖ.
అయితే ఇవాళ (గురువారం) ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి మంత్రులు వచ్చారు. ఈ క్రమంలోనే కొండా సురేఖ అస్వస్థతకు గురయ్యారు. సచివాలయంలో అస్వస్థతకు గురైన మంత్రి కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు పరామర్శించారు. ఆమె ఆరోగ్యపరిస్థితిపై సీఎం, మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సచివాలయంలో కేబినెట్ సమావేశం ప్రారంభమైంది.
ఈ వార్తలు కూడా చదవండి.
Read Latest Telangana News and National News