Share News

Diwali Celebrations: సౌదీ అరేబియా దీపావళి ఉత్సవంలో అరబ్బులు, విదేశీ దౌత్యవేత్తలు

ABN , Publish Date - Nov 01 , 2025 | 08:27 PM

‘దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీపం నమోస్తుతే’.. అంటూ దీపారాధన చేసి సకల దేవతలను పూజించే దీపం పూజ గది దాటి దీపావళి సందర్భంగా వాకిట్లో వస్తుంది కానీ ఈసారి ఎర్ర సముద్రం తీరం ఆలలు దాటి ప్రవాసీ లోకాన వెలుగులు విరజిమ్మింది.

Diwali Celebrations: సౌదీ అరేబియా దీపావళి ఉత్సవంలో అరబ్బులు, విదేశీ దౌత్యవేత్తలు
Diwali Celebrations

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ‘దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీపం నమోస్తుతే’.. అంటూ దీపారాధన చేసి సకల దేవతలను పూజించే దీపం పూజ గది దాటి దీపావళి (Diwali Celebrations) సందర్భంగా వాకిట్లో వస్తుంది కానీ ఈసారి ఎర్ర సముద్రం తీరం ఆలలు దాటి ప్రవాసీ లోకాన వెలుగులు విరజిమ్మింది. భారతీయ పండుగలు సంప్రదాయాల సమ్మేళనాలు. తరతరాల ఆచారాలు, జీవన రీతులను సంరక్షిస్తూ భారతావని సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబించే పండుగల్లో దీపావళీ ప్రముఖం.


Diwali.jpg

నూరే దివాళీ ( దీపావళి వెలుగులు) పేరిట సౌదీ అరేబియాలోని జెద్ధా నగరంలో గురువారం రాత్రి భారతీయ కాన్సులేట్ అవరణలో దీపావళి పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించగా ప్రప్రధమంగా సౌదీ అరేబియా ప్రముఖులు, స్థానికంగా ఉండే వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

సౌదీ అరేబియాలోని ప్రవాసీయులు తమ భారతీయ సాంస్కృతి, విలువల పరిరక్షణ కోసం చేస్తున్న కృషిను భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరీ ప్రశంసించారు.


Diwali-2.jpg

భారతీయ కుటుంబాలకు దీపావళి ఒక పండుగ మాత్రమే కాదని.. మాతృభూమితో ఒక వారధి అని తెలుగు ప్రవాసీ సంఘం సాటా (యం) అధ్యక్షుడు మల్లేషన్ వ్యాఖ్యానించారు. చీకటిపై వెలుతురు ఎప్పటికీ విరజిమ్మాలని కోరుకొంటున్నట్లుగా, భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం పాటుపడే ప్రవాసీ సంఘమైన జె.టి.యం నాయకురాలు గాలి దుర్గ భవానీ చెప్పుకొచ్చారు.

దీపావళిని ప్రప్రధమంగా సౌదీ అరేబియాలో జరుపుకోవడంపై కడప జిల్లాకు చెందిన శివానంద, లక్ష్మి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఉషా కిరణ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Diwali-3.jpg

ప్రతిష్టాత్మకమైన దీపావళీ ఉత్సవాల నిర్వహణలో తెలుగు ప్రవాసీయులు కీలక పాత్ర వహించారు. ఈ వేడుకల్లో మఖ్యమైన సాంస్కృతిక, భోజన ఏర్పాట్లను తెలుగు ప్రవాసీ సంఘాలైన జె.టి.యం, సాటా సమన్వయం చేశాయి. అరబ్బు నేలపై భారతీయ సంస్కృతి, పరిరక్షణ కోసం కృషి చేసే బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన దుర్గ భవానీ – శివరామకృష్ణా దంపతుల ఆధ్వర్యంలోని జె.టి.యం వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జె.టి.యం జెద్ధా నగరంలోని తెలుగు ప్రవాసీ సంఘం కాగా ఇది భారతీయ పండుగలు, సంస్కృతి పరిరక్షణ కోసం పని చేస్తుంది. దీపావళీ పండుగను భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు వివిధ రకాలుగా నిర్వహించుకుంటుండగా సౌదీ అరేబియాలో కూడా ఆయా రాష్ట్రాల సంస్కృతి, ఆచారాలు ప్రతిబింబిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించగా అందులో మహారాష్ట్ర మహిళల జానపద గేయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను ఆలరించాయి.


భారతదేశం వివిధ వంటకాలకు, ప్రాంతీయ రుచులకు పెట్టింది పేరు. దేశంలో ప్రతి ప్రాంతం, రాష్ట్రం మధ్య ఆహారం, రుచులు మారుతూ ఉంటాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఎన్నో విభిన్నమైన వంటకాలు నోరూరిస్తాయి, ఎక్కడో పరాయి దేశంలో విభిన్న రకాల వంటకాలను ఒక్క చోటైనా ఐరోపా, ఆఫ్రీకా, ఆసియా, అమెరికా ఖండాల విదేశీ దౌత్యవేత్తలతో పాటు స్థానిక అరబ్బు ప్రముఖులకు వడ్డీంచడం అంత సులువేమి కాదు. భోజన ఏర్పాట్లను మరో తెలుగు ప్రవాసీ సంఘం సాటా సమన్వయం చేసింది. సాటా (యం) అధ్యక్షుడు మల్లేషం విశ్వనాథన్ దీన్ని సమన్వయం చేశారు. సభికులు, అతిథులు అందరూ కలిసి రుచికరమైన విందు భోజనం, సంప్రదాయ దీపావళి మిఠాయిలను అస్వాదించారు.

రెండు తెలుగు ప్రవాసీ సంఘాలు – సాటా(యం), జె.టి.యంలతో పాటు ఐ.బి.పి.యన్, దిశ, జె.టి.యస్, మహారాష్ట్ర మండల్, ఐ.ఓ.యఫ్ , లాయర్స్ అసోసియేషన్, కేరళ సమాజం, టి.యస్.యస్, ఒడిశా మండల్ కూడ ఈ వేడుకల్లో పాల్గొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్

గల్ఫ్ నుండి ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమానాలు నడపాలి..ఏపీ సీఎంకు ఎన్నారైల విజ్ఞప్తి

Read Latest and NRI News

Updated Date - Nov 01 , 2025 | 10:17 PM