Home » Gulf News
హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాపై ఇరాన్ పదేపదే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఒక సురక్షితమైన ప్రత్యామ్నాయం మార్గాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు ప్రతిపాదించారు. అదే 'మెడిటరేనియన్ పైప్లైన్' రీ-రూటింగ్ ప్లాన్.
పశ్చిమాసియాలో అమెరికా వేల సంఖ్యలో పారాట్రూపర్లను మోహరించింది. వ్యూహాత్మక ప్రాంతాలకు వీరిని తరలించింది. మిత్రదేశాలకు రక్షణ, అమెరికా ప్రయోజనాలను కాపాడటమే దీని లక్ష్యమని పెంటగాన్ వర్గాలు చెబుతున్నాయి.
కువైట్ విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ పేలుడులో ఒక భారతీయుడు మృతి చెందారు. పరిస్థితిని చక్కదిద్దడానికి అత్యవసర చర్యలు చేపట్టారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, పుకార్లు వ్యాప్తి చేయవద్దని కువైట్ ప్రభుత్వం ప్రజలకు విన్నవించింది.
ఇరాన్లోని కీలకమైన ఖొండాబ్ హెవీ వాటర్ ప్లాంట్పై ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడులు ఆ దేశ అణు కార్యక్రమాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ఈ దాడిలో ప్లాంట్ తీవ్రంగా దెబ్బతిన్నదని, అది ఇక ఏమాత్రం పనిచేసే స్థితిలో లేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది.
ఇరాన్ ప్రభుత్వ మీడియా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పేరుతో ఒక వ్రాతపూర్వక సందేశాన్ని విడుదల చేసింది. సదరు సందేశంలో ఇరాన్కు మద్దతుగా నిలిచినందుకు ప్రజలకు, అక్కడి మత పెద్దలకు మొజ్తబా కృతజ్ఞతలు చెప్పినట్టుంది. అయితే, మొజ్తబా మాట్లాడిన వీడియో లేదా, ఆడియో బయటకు రాలేదు.
ప్రస్తుత యుద్ధ సమయంలో 'గల్ఫ్ దేశాల' సాయం మరువలేనిదని ప్రధాని మోదీ అన్నారు. ఈ కష్టకాలంలో భారత ప్రయోజనాలకు, ముఖ్యంగా చమురు సరఫరా, భారతీయుల భద్రతకు సహకరిస్తున్న గల్ఫ్ దేశాలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
పశ్చిమాసియా యుద్ధం కీలక మలుపు తీసుకుంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా వైమానిక, నౌకాదళాలు దాడులకు దిగాయి. ఈ క్రమంలో ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రం 'ఖార్గ్ ఐలాండ్'ను అమెరికా దళాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
బహ్రెయిన్ అల్యూమినియం ప్లాంట్పై డ్రోన్ దాడి తామే చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. బహ్రెయిన్ ప్రభుత్వం అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు సహకరిస్తోందనే ఈ దాడులు చేశామని తెలిపింది.
మా విద్యాసంస్థలే వాళ్ల లక్ష్యంగా ఉన్నాయని అమెరికా, ఇజ్రాయెల్లపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇరాన్ శాస్త్రీయ పునాదులను, సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీసేందుకే ఈ క్రూరమైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ కూడా గట్టిగా ప్రతిస్పందిస్తున్న సంగతి తెలిసిందే. పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది.