Bhagavad Gita: భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. ప్రధాని మోదీ స్పందన ఇదే..
ABN , Publish Date - Apr 18 , 2025 | 01:19 PM
Bhagavad Gita UNESCO:హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత, నాట్యశాస్త్రాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఈ రెండింటినీ చేర్చడంతో.. ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఈ విధంగా స్పందించారు.

Bhagavad Gita UNESCO: యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు తార్కాణంగా పిలిచే పవిత్ర గ్రంథం భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రాలకు చోటు దక్కింది. భారతదేశ సంస్కృతి, చారిత్రక, తాత్విక వారసత్వానికి ప్రతీకలుగా గుర్తిస్తూ యునెస్కో (UNESCO) ఈ గౌరవాన్ని కల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ ఘనతపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో ఇలా ట్వీట్ చేశారు.
"ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడికి ఇది గర్వకారణమైన క్షణం. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత, నాట్యశాస్త్రం చేర్చడం అంటే మన కాలాతీత జ్ఞానం, గొప్ప సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా దక్కిన ఘనమైన గుర్తింపు. గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికత, చైతన్యాన్ని పెంపొందించాయి. ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి" అని ప్రధాని మోదీ అన్నారు.
యునెస్కో తన మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో 74 కొత్త డాక్యుమెంటరీ హెరిటేజ్ కలెక్షన్స్ జోడించింది. దీనితో తాజాగా లిఖిత సేకరణల సంఖ్య మొత్తం 570కి చేరుకుంది. నాట్యశాస్త్రం కళా ప్రదర్శనలకు సంబంధించి ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు.
Read Also: Maharashtra: అప్పుడు అందరికీ బట్టతల వైరస్.. ఇప్పుడు ఇంకోటి.. వరస మిస్టరీ వైరస్లకు కారణమేంటి..
MLA: అసెంబ్లీలో నవ్వులు పూయించిన ఎమ్మెల్యే.. ఆయన ఏమన్నారంటే..
Flight: జూన్ నుంచి తిరుచ్చి - హైదరాబాద్ విమాన సేవలు