Share News

Maoist Encounter: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావో నేతల మృతి

ABN , Publish Date - Jun 07 , 2025 | 09:16 AM

ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య పోటాపోటీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్ట్‌లు హతమయ్యారు. బీజాపూర్ నేషనల్ పార్క్‌ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి.

Maoist Encounter: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. కీలక మావో నేతల మృతి
Maoist Encounter

ఛత్తీస్‌గడ్: ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ (Maoist Encounter) జరిగింది. ఇవాళ (శనివారం) భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య పోటాపోటీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్ట్‌లు హతమయ్యారు. బీజాపూర్ నేషనల్ పార్క్‌ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్ మూడో రోజు కూడా కొనసాగుతోంది. మొన్న కేంద్ర కమిటీ సభ్యుడు లక్ష్మీనరసింహం, నిన్న భాస్కర్ ఎన్‌కౌంటర్‌లో హతమైన విషయం తెలిసిందే. ఇవాళ మూడో రోజు ఇద్దరు కీలక నేతలు మృతిచెందారు. భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.


కాగా, కేంద్రప్రభుత్వం ఆపరేషన్ కగార్‌తో మావోలను ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. ఇందులో భాగంగానే గతకొన్ని రోజులుగా మావోయిస్ట్‌లపై భద్రతా బలగాలు చర్యలు తీసుకుంటున్నాయి. మావోలపై భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌‌లలో పలువురు అగ్రనేతలు మృతిచెందారు. తాజాగా బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌‌‌లోనూ ఇద్దరు కీలక నేతలు మృతిచెందారు. వరుసగా మావోలకు ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ప్రభావం కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా.. మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని పౌర హక్కుల సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మావోలతో చర్చలపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


ఈ వార్తలు కూడా చదవండి

రాజన్న కోడెలపై రాజకీయం వద్దు: సురేఖ

రాష్ట్రంలో పర్సెంటేజీల పాలన : డీకే అరుణ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 07 , 2025 | 09:34 AM