Home » Encounter
మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు సుధాకర్(65) అంత్యక్రియలు ఏలూరు జిల్లా పెదపాడు మండ లం సత్యవోలు గ్రామంలో సోమవారం జరగనున్నాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.
ఛత్తీస్గడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య పోటాపోటీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్ట్లు హతమయ్యారు. బీజాపూర్ నేషనల్ పార్క్ సమీపంలో ఎదురు కాల్పులు జరిగాయి.
సీపీఐ(మావోయిస్టు) పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారని రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నేత బల్లా రవీంధ్రనాథ్ ఆరోపించారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన చేశారు.
దళపతిని కోల్పోయి అసలే కష్టాల్లో పడిపోయిన మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటరులో మరో అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ అలియాస్ గౌతమ్ (65) మృతి చెందారు.
ఛత్తీస్గఢ్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్లో జరిగిన ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మరణించారు. వారిలో అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని ఓ అడవీ ప్రాంతంలో పోలీసులతో మావోయిస్టులు ఎదుర్కాల్పులు జరిగి, కీలక నేత జూనియర్ హిద్మా (మోహన్)ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి AK-47 తుపాకీ, 35 రౌండ్ల తూటాలు, 117 డిటొనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.
చత్తీగఢ్లో నక్సల్ నేత నంబాల కేశవరావు సహా ఆరు నక్సల్స్ మృతదేహాలను పోలీసులు బంధుమిత్రుల లేకపోవడంతో తమంత్యక్రియలు నిర్వహించారు. స్థానికులు మరియు ప్రజాసంఘాలు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
విజయవాడలో సీపీఐ నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే ఆపాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానించారు. బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
నంబాల కేశవరావు మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి శ్రీకాకుళం ఎస్పీ అడ్డంకులు సృష్టిస్తున్నారని పౌరహక్కుల సంఘం ఆరోపించింది. ఈ మేరకు వారు సీఎం, హోంమంత్రికి లేఖ రాశారు.