Rahul Gandhi: బీజేపీపై మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలు.. రాహుల్ పోస్ట్
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:56 PM
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించేందుకు 'మ్యాచ్ ఫిక్సింగ్' వ్యూహాన్ని బీజేపీ అనుసరించిందని ఆరోపించారు. బీహార్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతం కానుందని అన్నారు.
'ఎన్నికల్లో అక్రమాలు ఎలా? 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యం రిగ్గింగ్కు ఒక ఉదాహరణ. ఐదు అంచెలలో ఇది జరుగుతుంది. ఎన్నికల కమిషన్ నియామకంలో ప్యానల్ రిగ్గింగ్, ఎన్నికల జాబితాలో నకిలీ వోట్లు చేర్చడం, ఓటరు ఓటింగ్ శాతాన్ని పెంచడం, గెలుపు అవసరమైన చోట బోగస్ ఓట్లపై దృష్టి పెట్టడం, సాక్ష్యాలను దాచిపెట్టడం అనే ఐదు అంచెల్లో ఇది జరుగుతుంది. రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటింది. మోసంతో ఆట గెలవడం. అయితే ఇందువల్ల వ్యవస్థలకు నష్టం, ప్రజావిశ్వాసం కోల్పోవడం జరుగుతుంది. ప్రజలంతా ఈ సాక్ష్యాలను గమనించి న్యాయాన్యాయాలను నిర్ధారించాలి. జవాబులు కోరాలి. ఎందుకంటే మహారాష్ట్ర మ్యాచ్ ఫిక్సింగ్ ఆ తరువాత జరిగే బీహార్ ఎన్నికల మందుకు రాబోతోంది. ఏదిఏమైనా బీజేపీ ఓడిపోతుంది' అని రాహుల్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదకగా పోస్టు పెట్టారు. త్వరలో జరగునున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి 288 స్థానాలకు గాను 235 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ సొంతంగా 132 సీట్లు గెలుచుకుని మహారాష్ట్రలోనే తొలిసారిగా అత్యధిక స్థానాలు సాధించింది. కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ)తో కూడిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి కేవలం 50 సీట్లు గెలుచుకుంది. ఈ ఓటమితో థాకరే, పవార్ పార్టీలకు గట్టి దెబ్బ తగలడంతో పాటు తమ పార్టీల పేర్లు, ఎన్నికల గుర్తులను కోల్పోయాయి.
ఘాటుగా స్పందించిన బీజేపీ
మహారాష్ట్ర ఎన్నికల్లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ బీహార్కు రాబోతోందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. రాహుల్ వ్యాఖ్యలు హుందాగా లేవని, దేశ ప్రజాస్వామిక సంస్థలను బలహీనపరుస్తూ మాట్లాడటం ఆయనకు అలవాటుగా మారిందని ఆ పార్టీ ప్రతినిధి తుహిన్ సిన్హా అన్నారు. రాహుల్ లేవనెత్తిన అంశాలకు ఎన్నికల కమిషన్ అనేక మార్లు వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు.
బీజేపీ కూటమిలోకి పీఎంకే, డీఎండీకే
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి