Home » Assembly elections
తమిళనాడు అభివృద్ధికి డీఎంకే తిరిగి అధికారంలోకి రావడం తప్పనిసరని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమిని చిత్తుగా ఓడించి దానిని బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
టీవీకే నేత విజయ్కు రాష్ట్ర ప్రజల గురించి తమిళ సంస్కృతి, రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేకుండా కలల ప్రపంచంలో విహరిస్తున్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ విమర్శించారు.
ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్రంలో పెత్తనంచెలాయిస్తున్న బీజేపీ మంత్రులకు అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి కట్టుబానిసలా వ్యవహరిస్తున్నారని ఉపముఖ్యమంత్రి ఉదయనిధి ఎద్దేవా చేశారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మేనిఫెస్టోను బీజేపీ (BJP) మంగళవారంనాడు విడుదల చేసింది. సంక్షేమం, హెల్త్కేర్, ప్రజలకు ఆర్థిక భద్రత వంటి హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీతో ఎల్డీఎఫ్ జత కట్టిందని ఆరోపించారు. అందువల్లే ఈ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ గెలవాలని మోదీ కోరుకుంటున్నారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకుడు విజయ్ పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాలను ఎంచుకోవడం వెనుక బలమైన కారణాలు వినిపిస్తున్నాయి.
అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ కొంతమంది చేస్తున్న విమర్శలను డీఎంకే నాయకురాలు కనిమొళి కొట్టిపారేశా రు. వారి మేనిఫెస్టోను కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని వ్యాఖ్యానించారు.
డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్కు ఇవే చివరి ఎన్నికలని, ఆయన్ని ఇంటికి సాగనంపాలని ప్రజలు నిర్ణయించారని ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామికి ఉద్వాసన పలకాలని, తద్వారా బీజేపీ మాయమాటలకు తమిళనాడు లొంగదని బలంగా చాటిచెప్పాలని డీఎంకే నేత, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు బీజేపీ పరోక్షంగా మద్దతిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్కు, సీపీఎం-బీజేపీ కంబైన్కు మధ్యే జరగనుందని అన్నారు.