Home » Assembly elections
రానున్న శాసనసభ ఎన్నికల్లో ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్(Archana Patnayak) తెలిపారు. సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో కూటమి నుంచి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని డీఎంకే అధిష్టానాన్ని కోరుతామని డీపీఐ నేత తొల్ తిరుమావళవన్ ప్రకటించారు. చిదంబరం లోక్సభ నియోజకవర్గంలో గురువారం ఉదయం పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడాకగ.
ఎన్నికల్లో కూటమి లేకుండా డీఎంకే గెలవడమన్నది అసాధ్యమని, 2019 లోక్సభ ఎన్నికల నుండి 2024 లోక్సభ ఎన్నికల దాకా మిత్రపక్షాలను కలుపుకునే ఆ పార్టీ గెలిచిందని, ఈ పరిస్థితి వచ్చే యేడాది జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి.షణ్ముగం వ్యాఖ్యానించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని పాశ్వాన్ తెలిపారు. కేంద్ర రాజకీయాల్లో కొనసాగడంపై మాట్లాడుతూ, ఎక్కువ కాలం కేంద్ర రాజకీయాల్లో కొనసాగుతానని తాను అనుకోవడం లేదన్నారు.
తమిళనాట అధికార డీఎంకే అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలపై కేంద్ర హోంమంత్రి అమిత్షా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 10 శాతం హామీలను కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్ని వాగ్దానాలు అమలు చేశారో జాబితా ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ను సవాలు చేశారు.
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.
బీజేపీ కూటమిలో పీఎంకే, డీఎండీకే వస్తాయనే నమ్మకం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగంద్రన్ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం మదురై ఒత్తకడైలో జరుగనున్న బీజేపీ సమావేశంలో పాల్గొననున్నారు.
వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, సినీ హీరో విజయ్(Vijay) ప్రజల చెంతకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. మొత్తం 42 రోజుల పాటు ప్రజల్లో తిరగాలని ఆయన భావిస్తున్నారు.
చిరాగ్ పాశ్వాన్ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి కాకుండా జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పార్టీ రాష్ట్ర బిహార్ ఇన్ఛార్జ్, జాముయి ఎంపీ అరుణ్ భారతి ఆదివారం నాడు ఒక ట్వీట్లో కోరారు.