Home » Assembly elections
అధికారంలో భాగస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోరబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ పలు సర్వేలు ఇప్పటికే సూచన ప్రాయంగా వెల్లడించాయన్నారు.
రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి తావులేదని అన్నాడీఎంకే ఎంపీ తంబిదురై అన్నారు. 2026లో ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనా.. మిత్రపక్షాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించే ప్రసక్తి ఉండదని స్పష్టం చేశారు.
‘ఆలూ లేదు.. చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లుగా ఉంది అన్నాడీఎంకే - బీజేపీ కార్యకర్తల తీరు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే కొందరు బీజేపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నయినార్ నాగ్రేందన్ అంటూ ప్లెక్సీలు వేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
అగ్రహీరో విజయ్ స్థాపించి తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది దీనిలో భాగంగా పార్టీ విజయావకాశాలపై ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసి గెలిచి అధికారం చేపట్టాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
నితీష్ కుమార్ ఆరోగ్యంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిషాంత్ కొట్టివేశారు. నితీష్ కుమార్ 100 శాతం ఆరోగ్యంగా, పూర్తి ఫిట్నెస్తో ఉన్నారనీ, ప్రజలు కూడా స్వయంగా చూడొచ్చని చెప్పారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారం చేపట్టే స్థాయికి తీసుకెళతానని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ అన్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈపీఎస్ నేతృత్వంలోని కూటమి మెజార్టీ స్థానాలు సాధించి అధికారం కైవసం చేసుకుంటుందని ఆయన అన్నారు.
Bihar Assembly Elections: రాజకీయాలకు క్రీడలకు విడదీయరాని అనుబంధం ఉంది. చాలా మంది స్పోర్ట్ స్టార్ట్స్ పాలిటిక్స్లోకి వచ్చి మంచి సక్సెస్ అయ్యారు. అయితే రాజకీయల కోసం క్రీడల్ని వాడుకోవడం, పొత్తులపై స్పష్టత ఇచ్చేందుకు పాలిటిక్స్ను యూజ్ చేయడం మాత్రం ఎక్కడా చూసుండరు. ఇది బిహార్లో చోటుచేసుకుంది. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ మధ్య పొత్తు కుదరడంపై డీఎంకే ప్రతినిధి టీకేఎస్ ఇళాంగోవన్ సూటిగా స్పందించారు.
అన్నాడీఎంకేకు ఎలాంటా షరతులు, డిమాండ్లు లేవని అమిత్షా చెప్పారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చోసుకోమని, పొత్తుల వల్ల అటు ఎన్డీయేకు, అన్నాడీఎంకే కూడా లబ్ధి చేకూరనుందని తెలిపారు.
బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం'రహస్యం'గా డీఎంకేకు సహకరిస్తోందని విజయ్ ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం కాంగ్రెస్ వైపు డీఎంకే ఉంటూ, కుంభకోణాలప్పుడు రహస్యంగా బీజేపీ సైడ్ ఉంటోందని అన్నారు. తమళనాడు పట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు.