Home » National News
డీఎంకే కూటమి తరఫున తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన కమల్హాసన్ చెన్నైలో పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. కొందరు అభిమానులు వైదికపైకి వచ్చి కమల్ పట్ల తమ అభిమానం చాటుకున్నారు.
ఇంజన్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రోటాకాల్ ప్రకారం ఏప్రిల్ 2025లో ఎడమవైపు ఇంజన్ను కూడా తనిఖీ చేశారని, ఇంజన్లో కానీ, విమానంలో కానీ ఎలాంటి సమస్యలు లేవని అధికారులు చెప్పారు.
అహ్మదాబాద్ సమీపంలో జరిగిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఘోర ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ బాధితుల మృతదేహాలను గుర్తించడంలో DNA పరీక్షల (Air India Crash DNA) ప్రక్రియ మరింత ఆలస్యం అవుతోంది. దీంతో బాధితుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి.
బోయింగ్ 787 లోపభూయిష్టమని, ప్రయాణికుల ప్రమాదకరమని సలోహ్పోర్ అనే విజిల్బ్లోయర్ ఏడాది క్రితమే హెచ్చరించారు. తాజాగా ఇదే విషయాన్ని మాజీ బోయింగ్ అత్యున్నత స్థాయి మేనేజర్ నుంచి విజిల్బ్లోయర్గా మారిన ఎడ్ పియర్సన్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి మోదీ ఈనెల 15, 16 తేదీల్లో ఆ దేశంలో అధికారిక పర్యటన జరుపుతారు. రెండు దశాబ్దాలుగా ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే ప్రథమం.
శనివారం సాయంత్రం 5-7, 7-9 గంటల మధ్య రెండు స్లాట్లలో రామ దర్బార్ను సందర్శించేందుకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని నిర్ణయించిట్టు శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు సభ్యులు అనిల్ మిశ్రా తెలిపారు.
విమాన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులు తమ డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చేందుకు ఆహ్మదాబాద్లోని బీజే ఆసుపత్రికి వస్తున్నారు. వారి రోదనలు మిన్నంటడంతో ఆసుపత్రిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్షిపణి వ్యవస్థలు, మిలటరీ కమాండ్పై ఇజ్రాయెల్ శుక్రవారం నాడు భీకర దాడులు జరిపింది. 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో విజయవంతమైన దాడులు జరిపినట్టు నెతన్యాహు ప్రకటించారు. అయితే, ఈ ఉద్రిక్తతల నడుమ ఆయన ప్రధాని మోదీ ఫోన్ చేశారు.
విమానం వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, కాక్పిట్ వంటి కీలక సమాచారం బ్లాక్బాక్స్లో ఉంటుంది. పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మధ్య సంభాషణలు రికార్డవుతాయి. ఎలాంటి విపత్తులు ఎదురైనా డేటా చెక్కుచెదరకుండా ఉండేలా బ్లాక్ బ్సాక్ను రూపొందిస్తారు.
అహ్మదాబాద్లో గురువారం బోయింగ్ 787-8 విమానం కుప్పకూలిన ఘటనలో విమానంలోని 242 మంది ప్రయాణికుల్లో 241 మంది మృతి చెందగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.