Home » National News
అయోధ్యలోని శ్రీరామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2024 జనవరి 22న జరిగింది. రామ్లల్లా గర్భగుడి గతంలోనే పూర్తయింది. తక్కిన మొదటి, రెండో అంతస్తు పనులు కొనసాగుతూ వచ్చాయి.
పహల్గాం దాడి అనంతర పరిణామాలు, భద్రత, సన్నద్ధతపై ప్రధానమంత్రి తన నివాసంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది.
పహల్గాం దాడి అనంతరం పాక్ ఉగ్రవాదంపై అడిగిన ప్రశ్నకు ఖవాజా మహమ్మద్ అహ్మద్ సూటిగా సమాధానం చెప్పకుండా, అమెరికా, బ్రిటన్, పశ్చిమా దేశాల కోసం మూడు దశాబ్దాలుగా చెత్తపనులన్నీ చేశామని ఇటీవల వ్యాఖ్యానించారు.
పహల్గాం దాడి కారణంగా పాకిస్థాన్తో సంబంధాలను భారత్ పూర్తిగా తెగతెంపులు చేసుకొంది. ఈ నేపథ్యంలో భారత్లో నివసిస్తున్న పాకిస్థానీలను వెంటనే దేశం విడిచి వెళ్లేలా ఆదేశాలు జారీ చేసింది. అందుకు సంబంధించిన గడువు సైతం తీరిపోవచ్చింది. అలాంటి వేళ పాకిస్థాన్కు చెందిన మరియం ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది.
పహల్గాంలో ఉగ్రవాదులు అత్యంత పాశవికంగా 26 మంది టూరిస్టులను పొట్టనపెట్టుకోవడంతో జమ్మూకశ్మీర్ అంతటా కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్లు ఉధృతం చేశారు. ఈ క్రమంలో భద్రతా ఏర్పాట్లు, బలగాల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించేందుకు ఎంహెచ్ఏలో అత్యున్నత స్థాయి భద్రతా సమావేశం నిర్వహించారు.
పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో సభ్యులు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది. ఈ సందర్భంగా గుజరాత్కు చెందిన పర్యాటకుడు రిషి భట్ను విచారించింది. అతడు ఈ ఉగ్రదాడిపై పలు సంచలన విషయాలను వెల్లడించారు.
వేంద్ర ఫడ్నవిస్ అధ్యక్షతన మంగళవారంనాడిక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశంలో పహల్గాం మృతుల కుటుంబాలకు తొలుత సంతాపం ప్రకటించారు. అనంతరం మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెగాసస్ స్పైవేర్ను తమపై ఉపయోగించినట్టు ఎవరైనా అనుమానిస్తే వారు కోర్టును ఆశ్రయించవచ్చని, నిజంగానే వారిని టార్గెట్ చేశారా లేదా అనే దానిపై సమాచారం అందిస్తామని ధర్మాసనం తెలిపింది. సాంకేతిక బృందం నివేదక అనేది వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్ కాదని స్పష్టం చేసింది.
సరిహద్దుల వద్ద నిఘా కోసం చిన్న చిన్న డ్రోన్లను ఉపయోగించడం, వాటిని కూల్చేసినట్టు ఇరువైపు సైనిక వర్గాలు ప్రకటించుకోవడం రివాజే. అయితే ఈసారి రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన క్రమంలో భారత డ్రోన్ను కూల్చేసినట్టు పాక్ ఆర్మీ ప్రకటించడం సంచలనమవుతోంది.