Home » Elections
రానున్న శాసనసభ ఎన్నికల్లో ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్(Archana Patnayak) తెలిపారు. సచివాలయంలోని ఎన్నికల కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు
వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో కూటమి నుంచి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని డీఎంకే అధిష్టానాన్ని కోరుతామని డీపీఐ నేత తొల్ తిరుమావళవన్ ప్రకటించారు. చిదంబరం లోక్సభ నియోజకవర్గంలో గురువారం ఉదయం పర్యటించిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో రానున్న శాసనసభ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. తిరునల్వేలి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడాకగ.
త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పునరావృతమయ్యే అవకాశం ఉందని రాహుల్ విమర్శించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యాన్ని విషపూరితం చేస్తాయని అన్నారు.
బంగ్లాదేశ్లో జాతీయ ఎన్నికలు నిర్వహించాలంటూ ప్రజల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ తలొగ్గారు.
రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్లతో గత ఏడాది బంగ్లాదేశ్లోని ప్రధాన నగరాలు అట్టుడికాయి. పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో దేశం విడిచి పారిపోయిన షేక్ అసీనా భారతదేశంలో తలదాచుకుంటున్నారు.
మరికొద్ది రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఎమ్మెల్యేలంతా సిద్ధం కావాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) సూచించారు.
రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది.
తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాల ప్రకారం 6 స్థానాల్లో 4 స్థానాలను డీఎంకే సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, తక్కిన రెండు సీట్లను బీజేపీ, మిత్రపక్షాల మద్దతుతో అన్నాడీఎంకే గెలుచుకునే వీలుంది.
ఏం భయంలేవు.. మళ్లీ అధికారం మనదే.. అంటూ డీఎంకే పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాశారు. జూన్ ఒకటో తేదీ ఉదయం 9 గంటలకు మదురైలో పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతుందని తెలిపారు.