Share News

Bangalore: ఆర్సీబీకి పోలీసుల షాక్.. గట్టిగా బిగిస్తున్నారుగా..

ABN , Publish Date - Jun 06 , 2025 | 09:24 AM

బెంగళూరు తొక్కిసలాట ఘటనలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆర్సీబీ జట్టులోని కీలక అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు.

Bangalore: ఆర్సీబీకి పోలీసుల షాక్.. గట్టిగా బిగిస్తున్నారుగా..

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ (Royal Challengers Bangalore) విజయోత్సవాల్లో తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మార్కెటింగ్ విభాగం అధికారి నిఖిల్ సొసాలేని కూడా ఉన్నారు.


బెంగళూరు విమానాశ్రయం (Bangalore Airport) నుంచి ముంబై వెళ్తుండగా నిఖిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మరో ముగ్గురు నిందితులు.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ DNA కి చెందినవారని తెలిసింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కి చెందిన కార్యదర్శి శంకర్, కోశాధికారి జయరామ్ పరారీలో ఉన్నారు. ఈ కేసులో ఆర్సీబీ జట్టు మార్కెటింగ్ హెడ్ నిఖిల్‌తో పాటూ ,ఈవెంట్‌ను నిర్వహించిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ముగ్గురు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్-2025 ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 17 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఈ ఏడాది ఫైనల్స్‌లో పంజాబ్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. అయితే ఈ సందర్భంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ ర్యాలీ చేశారు. ఈ ఘటనలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.


ఈ వార్తలు కూడా చదవండి..

చట్టసభ సభ్యులకు ఎలాన్ మాస్క్ కీలక సూచన

మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేయాల్సింది: బీసీసీఐ

For National News And Telugu News

Updated Date - Jun 06 , 2025 | 10:06 AM