Share News

Sharmistha Panoli: శర్మిష్ఠ కేసులో ట్విస్ట్.. కేసు పెట్టి పరారైన వజాహత్.. గాలిస్తున్న పోలీసులు..

ABN , Publish Date - Jun 03 , 2025 | 07:00 PM

Sharmistha Panoli Wajahat Khan: న్యాయ విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలిపై కేసు దాఖలు చేసిన వజాహత్ ఖాన్ పరారీలో ఉన్నాడు. కోల్‌కతాకు చెందిన వజాహత్ ఓ మతానికి చెందిన దేవతలు, ఆచారాలపై అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Sharmistha Panoli: శర్మిష్ఠ కేసులో ట్విస్ట్.. కేసు పెట్టి పరారైన వజాహత్.. గాలిస్తున్న పోలీసులు..
Wajahat Khan Missing After Sharmistha Arrest

Wajahat Khan Missing After Sharmistha Arrest: 22 ఏళ్ల పూణే లా విద్యార్థిని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలి (Sharmistha Panoli) అరెస్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఓ మతాన్ని కించపరిచేలా అభ్యంతరకర వీడియో పోస్ట్ చేసిందనే ఆరోపణలతో కోల్‌కతా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. క్షమాపణలు చెప్పినప్పటికీ 14 రోజుల రిమాండ్ విధించడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే శర్మిష్ఠపై కేసు వేసిన వజాహత్ ఖాన్ పేరు వెలుగులోకి వచ్చింది. ఓ మతాన్ని కించపరిచిందని ఫిర్యాదు చేసిన అదే వ్యక్తి మరో మతం, దేవతలు, ఆచారాలపై సోషల్ మీడియా ఖాతాల్లో అత్యంత హేయమైన పోస్టులు పెట్టడం గురించి దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వజాహత్ కనిపించకుండా పారిపోయాడు.


శర్మిష్ఠ పనోలి అరెస్టుకు కారణమైన వజాహత్ ఖాన్ పరారీలో ఉన్నాడు. పశ్చిమ బెంగాల్ సహా అస్సాం, ఢిల్లీ రాష్ట్రాల్లో వజాహత్‌పై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మూడు రాష్ట్రాల పోలీసులు వజాహత్ ఖాన్ కోసం గాలిస్తున్నారు. అతని తండ్రి సాదత్ ఖాన్ చెప్పిన ప్రకారం.. శర్మిష్ఠ అరెస్టు తర్వాత అనేక మంది నుంచి బెదిరింపు కాల్స్ రావడంతో తన కుమారుడు పారిపోయాడని తెలిపారు. ఆదివారం రాత్రి నుంచి కనిపించడం లేదని వెల్లడించారు. మరి, వజాహత్ ఖాన్ ఎవరు?, అతడి ఫిర్యాదుకు కోల్‌కతా పోలీసులు ఎందుకంత ప్రాధాన్యం ఇచ్చారు?, శర్మిష్ఠ పనోలిని అరెస్టు తర్వాత ఎందుకు పరారయ్యాడు? అనే ప్రశ్నలు అందరి మదిలో రేకెత్తుతున్నాయి.


వజాహత్ పై ఫిర్యాదు..

శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ కోల్‌కతాకు చెందిన రషీది ఫౌండేషన్‌కు ప్రధాన కార్యదర్శి. ఇతడు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా ఓ మతాన్నిలక్ష్యంగా చేసుకుని దుర్మార్గంగా, రెచ్చగొట్టే, కించపరిచే పోస్ట్‌లను పంచుకున్నట్లు ఆరోపిస్తూ.. శ్రీ రామ్ స్వాభిమాన్ పరిషత్ అనే ఛారిటబుల్ ట్రస్ట్ తొలిసారి ఖాన్ పై గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 'ఆ మతానికి వ్యతిరేకంగా అవమానకర, అసభ్యకర పదజాలం వాడారని' ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కోల్‌కతా పోలీసులు 1,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మరీ శర్మిష్ఠను అరెస్టు చేసినట్లే.. వజాహత్ నూ అరెస్టు చేయాలని శ్రీ రామ్ ట్రస్ట్ బృందం డిమాండ్ చేసింది. ప్రస్తుతం వజాహత్ X ఖాతా లాక్ చేయబడింది. జూన్ 3 మధ్యాహ్నం నాటికి ఫేస్‌బుక్ అకౌంట్ క్లోజ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, తాజాగా కోల్‌కతా హైకోర్టు శర్మిష్ఠకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.


ఇవీ చదవండి:

ప్రజల వద్ద ఉన్న రూ.2000 నోట్లను తిరిగి తీసుకుంటాం..

జూన్ నెలలో 12 రోజులు బ్యాంకులు బంద్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 09:41 PM