Share News

Bengaluru Stampede: ఆ 11 మంది చావుకు ఆర్సీబీనే కారణం.. కోర్టులో షాకింగ్ ట్విస్ట్!

ABN , Publish Date - Jun 11 , 2025 | 02:22 PM

దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది బెంగళూరు తొక్కిసలాట ఘటన. ఆర్సీబీ విక్టరీ పరేడ్ సమయంలో భారీ తొక్కిసలాట జరగడం, అందులో 11 మంది ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ఈ కేసుపై కర్ణాటక హైకోర్టులో విచారణ జరుగుతోంది.

Bengaluru Stampede: ఆ 11 మంది చావుకు ఆర్సీబీనే కారణం.. కోర్టులో షాకింగ్ ట్విస్ట్!
Bengaluru Stampede

ఐపీఎల్-2025 ముగిసినా ఇంకా ఆర్సీబీ గురించి అంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. తొలిసారి విజేతగా నిలవడంతో కోహ్లీ జట్టును అంతా ప్రశంసల్లో ముంచెస్తున్నారు. అయితే విక్టరీ పరేడ్ విషయంలో మాత్రం భారీగా విమర్శలు మూటగట్టుకుంటోంది ఆ ఫ్రాంచైజీ. హడావుడిగా సెలబ్రేషన్స్ నిర్వహించడం ఏంటంటూ చాలా మంది ఎక్స్‌పర్ట్స్, నెటిజన్స్ ఆ ఫ్రాంచైజీని ఏకిపారేస్తున్నారు. ఈ ఉదంతంపై కర్ణాటక హైకోర్టులో విచారణ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. విక్టరీ పరేడ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని.. ఈ చావులకు ముమ్మాటికీ ఆర్సీబీదే బాధ్యత అని రాష్ట్ర సర్కారు తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి అన్నారు.

RCB-vs-Karnataka-Government.jpg-1.jpg


మొత్తం ప్రపంచాన్ని పిలిచారు..

బెంగళూరు తొక్కిసలాట ఘటనకు పూర్తి బాధ్యత ఆర్సీబీ, భారత క్రికెట్ బోర్డులదేనని అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి ఆరోపించారు. చిన్నస్వామి స్టేడియం గేట్ల నిర్వహణ, ఈవెంట్‌కు సంబంధించిన టికెట్ల మేనేజ్‌మెంట్ విషయంలో ఆర్సీబీ-బీసీసీఐ మద్య ఒప్పందం ఉందన్నారు. విక్టరీ పరేడ్‌కు అభిమానులు భారీగా తరలిరావాలని సోషల్ మీడియాతో పాటు పలు మాధ్యమాల్లో ఆర్సీబీ విపరీతంగా ప్రచారం చేసిందన్నారు శశికిరణ్. మొత్తం ప్రపంచం స్టేడియానికి రావాలి అన్నట్లుగా వాళ్లు వ్యహరించారని ఆయన చెప్పారు.

RCB-vs-Karnataka-Government.jpg-2.jpg


నో లెటర్..

చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 33 వేలేనని.. కానీ దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల మంది వరకు గేట్ల దగ్గర గుమిగూడారని అడ్వకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల తీవ్ర గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని, ప్రాణాలు పోవడమే గాక ఎంతో మంది గాయాలపాలయ్యారని చెప్పుకొచ్చారు. విక్టరీ పరేడ్, స్టేడియం సెలబ్రేషన్స్‌కు సంబంధించి రాష్ట్ర సర్కారు నుంచి అధికారికంగా ఆర్సీబీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది పేర్కొన్నారు. విక్టరీ పరేడ్ నిర్వహిస్తున్నామని సమాచారం మాత్రమే ఇచ్చారని.. ఆ కార్యక్రమాన్ని నిర్వహించి తీరాలని అప్పటికే వాళ్లు నిర్ణయించుకున్నారని శశికిరణ్ శెట్టి వివరించారు. అనుమతులు కోరుతూ సర్కారుకు ఎలాంటి లేఖలు రాలేదని, కేవలం సమాచారం మాత్రమే ఇస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇంటిమేషన్ లెటర్ అందిందని చెప్పుకొచ్చారు.


ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 04:51 PM