Home » High Court
పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది.
నటి ప్రత్యూష మృతి కేసులో నిందితుడైన సిద్ధార్థ్రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. ట్రయల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, తెలంగాణ హైకోర్టు దాన్ని రెండేళ్లకు తగ్గించింది. ఈ తీర్పును సవాల్ చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, నాలుగు వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ్రెడ్డిని ఆదేశించింది.
సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో 90 రోజుల నిబంధనపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో సినిమా నిర్మాతలకు భారీ ఊరట లభించినట్లయ్యింది. సినిమా టికెట్ రేట్లు పెంచాలంటే విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలంటూ..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులై ఆమె రికార్డు నెలకొల్పారు.
ఏపీ హైకోర్టు న్యాయయూర్తిగా జస్టిస్ లెసా గిల్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో ఈ కార్యక్రమం జరిగింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిపోర్ట్ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
‘ది కేరళ స్టోరీ 2’ సినిమా విడుదలపై విధించిన స్టేను కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఎత్తివేయడంతో చిత్ర యూనిట్కు పెద్ద ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేయడంతో సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది.
పురపాలక మంత్రిత్వ శాఖలో లంచం తీసుకుని ఉద్యోగ నియామకాలు జరిగా యనే ఆరోపణలు, టెండర్లలో అక్రమాలకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ విభాగం (ఈడీ) అందించిన ఆధారాల ప్రకారం నగరపాలక శాఖ మంత్రి కేఎన్ నెహ్రూ తదితరులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఏసీబీకి మద్రాసు హైకోర్టు ఆదేశించింది.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష మూల్యాంకనంలో అక్రమాలను నిగ్గు తేల్చేందుకు సిట్ ఏర్పాటుకు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన అభ్యర్థుల జవాబుపత్రాలు భద్రంగా ఉన్నాయా? లేదా? వాటిని ఎవరైనా ట్యాంపర్ చేశారా? అనేది ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలించాలని సూచించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది.