Share News

BREAKING: బిహార్‌.. పోలింగ్‌ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..

ABN , First Publish Date - Nov 06 , 2025 | 06:18 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

BREAKING: బిహార్‌.. పోలింగ్‌ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..

Live News & Update

  • Nov 06, 2025 15:18 IST

    బిహార్‌: పోలింగ్‌ సందర్భంగా లక్కీసరాయిలో ఉద్రిక్తత..

    • డిప్యూటీ సీఎం విజయ్‌ సిన్హా కాన్వాయ్‌పై రాళ్లదాడి

    • ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు

  • Nov 06, 2025 14:05 IST

    ఐపీఎస్‌ సంజయ్‌ కేసు విచారణ వాయిదా

    • విజయవాడ : ఐపీఎస్‌ సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు.

    • తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు.

    • ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ.

    • ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న సంజయ్‌

  • Nov 06, 2025 13:07 IST

    బండి సంజయ్ మీటింగ్‌కు.. అనుమతి నిరాకరణ

    • బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మీటింగ్‌కు అనుమతి రద్దు చేసిన పోలీసులు

    • షెడ్యూల్ ప్రకారం ఈరోజు సాయంత్రం బోరబండలో కొనసాగాల్సిన మీటింగ్

    • పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణుల మండిపాటు..

    • అనుమతి ఇచ్చి రద్దు చేయడమేంటని ప్రశ్నించిన బీజేపీ ఎన్నికల ఇంచార్జి ధర్మారావు

    • సాయంత్రం బోరబండలోనే మీటింగ్ జరిపి తీరుతామని స్పష్టీకరణ

    • బీజేపీ శ్రేణులంతా భారీ ఎత్తున తరలిరావాలని పిలుపు

    • ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచన

  • Nov 06, 2025 12:57 IST

    అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు

    • మరోసారి వ్యాపార వేత్త అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు

    • నవంబర్ 14వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు

    • రుణాల ఎగవేత కేసులో ఈడీ కేసు విచారణ

  • Nov 06, 2025 12:21 IST

    చీమల ఫోబియాతో గృహిణి ఆత్మహత్య..

    • సంగారెడ్డి జిల్లాలో చీమల ఫోబియాతో ఓ గృహిణి ఆత్మహత్య..

    • అమీన్‌పూర్ మున్సిపాలిటీ లోని శర్వా హోమ్స్‌లో మనీషా ఉరి వేసుకొని ఆత్మహత్య..

    • చీమల ఫోబియాతో చనిపోతున్నట్టు తన కూతురు జాగర్త అంటూ సూసైడ్ నోట్..

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

  • Nov 06, 2025 12:18 IST

    27 శాతం నమోదైన పోలింగ్

    • బీహార్‌లో కొనసాగుతున్న మొదటి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

    • 121 అసెంబ్లీ స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్

    • ఉదయం 11 గంటల వరకు 27.65 శాతం నమోదైన పోలింగ్

    • పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.

  • Nov 06, 2025 11:06 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం నితీష్ కుమార్

    • బీహార్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం నితీష్ కుమార్

    • ఎన్నికల మొదటి దశ ఓటింగ్‌ను పర్యవేక్షిస్తున్న ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్

    • ప్రతి పోలింగ్ బూత్‌ను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం

  • Nov 06, 2025 10:00 IST

    డ్రగ్స్ ఓవర్ డోస్‌తో వ్యక్తి మృతి

    • రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ ఓవర్ డోస్‌తో వ్యక్తి మృతి

    • ఒక అపార్ట్‌మెంట్‌లో డ్రగ్స్ సేవించిన అలీ అనే వ్యక్తి..

    • డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో మృతి చెందిన అలీ..

    • మొబైల్ రిపేర్ బిజినెస్ చేస్తున్న అలీ.

  • Nov 06, 2025 09:20 IST

    ఓటు హక్కు వినియోగించుకున్న తేజస్వి యాదవ్

    • కొనసాగుతున్న బీహార్ ఎన్నికల పోలింగ్..

    • ఓటు హక్కు వినియోగించుకున్న మహాఘట్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్..

    • ప్రతి ఒక్కరు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన తేజస్వి..

    • మార్పు, అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం ఓటు వేయాలని పిలుపు.

  • Nov 06, 2025 07:48 IST

    కత్తిపోట్లకు గురైన రౌడీషీటర్‌ మృతి

    • హైదరాబాద్‌: జగద్గిరిగుట్టలో నడిరోడ్డుపై కత్తిపోట్లకు గురైన రౌడీషీటర్‌ మృతి

    • జగద్గిరిగుట్ట బస్టాండ్‌ దగ్గర రోషన్‌ సింగ్‌పై బాల్‌రెడ్డి అనే మరో రౌడీషీటర్‌ కత్తితో దాడి

    • గాయాలపాలైన రోషన్‌ సింగ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి.

  • Nov 06, 2025 07:34 IST

    లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి

    • బాపట్ల బాపట్ల గడియార స్థంభం సెంటర్‌లో రోడ్డు ప్రమాదం..

    • తెల్లవారుజామున లారీని ఢీకొని ఇద్దరు యువకులు మృతి..

    • సూర్యలంక బీచ్‌కు వచ్చిన గుంటూరు‌కు చెందిన ఇద్దరు యువకులు..

    • బీచ్‌లో అనుమతి నిరాకరణతో తిరిగి వెళ్తుండగా.. లారీని ఢీకొన్న బైక్..

    • షేక్ జాన్ (22), నాని(20)లు మృతి..

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాపట్ల పట్టణ పోలీసులు.

  • Nov 06, 2025 07:21 IST

    బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం

    • కాసేపటి క్రితమే ప్రారంభమైన బీహార్ అసెంబ్లీ పోలింగ్

    • మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్

    • మొదటి విడత 121స్థానాలకు బరిలో ఉన్న 1,314 మంది అభ్యర్థులు

    • మొదటి విడత పోలింగ్‌‌లో పలువురు కీలకనేతలు ఆర్జేడీ నేత సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి

    • 5 కోట్ల మంది ఓటర్లకు వోటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ (వీఐఎస్) పంపిన ఎన్నికల సంఘం

    • మొత్తం 50,000కి పైగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు.

    • వీటిలో 1,000కి పైగా మహిళల కోసం పనిచేసే ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం