Share News

Sunitha Williams : 7 నెలలుగా నడవలేదు.. కూర్చోలేదు.. పడుకోలేదు.. సునీతా విలియమ్స్..

ABN , Publish Date - Jan 29 , 2025 | 07:51 PM

బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో గతేడాది జూన్‌ 5న తోటి వ్యోమగామి బచ్ విల్మోర్‌తో ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్న సునీతా విలియమ్స్ అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. ఏడు నెలలుగా అక్కడే చిక్కుకున్న ఆమె నడవటం మర్చిపోయానని ఇటీవల వెల్లడించడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను భూమికి తీసుకురావాలని స్పేస్‌ఎక్స్‌‌ని కోరినట్లు మస్క్‌ ప్రకటించారు..

Sunitha Williams : 7 నెలలుగా నడవలేదు.. కూర్చోలేదు.. పడుకోలేదు.. సునీతా విలియమ్స్..
Sunita Williams Stranded at ISS, Trump asks Help Elon Musk

బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో గతేడాది జూన్‌ 5న తోటి వ్యోమగామి బచ్ విల్మోర్‌తో ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్నారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షి కేంద్రానికి వెళ్లిన ఆమె సాంకేతిక సమస్యలు వల్ల నెలల తరబడి అక్కడే చిక్కుపోయారు. నిజానికి గతేడాది జూన్ 14నే వ్యోమగాములు ఇద్దరూ భూమికి చేరాల్సి ఉన్నా.. వారిని భూమికి తిరిగి రప్పించే విషయమై ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తోంది నాసా. అంతరిక్ష కేంద్రం నుంచి తమ పరిస్థితిపై తరచూ అప్‌డేట్స్ ఇస్తూ వస్తున్న సునీతా విలియమ్స్.. తాజాగా ఓ షాకింగ్ విషయం చెప్పారు. ఏడు నెలలుగా అంతరిక్షంలో నడవలేదు.. కూర్చోలేదు.. పడుకోలేదు.. అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇద్దరు వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పేస్‌ఎక్స్‌ని కోరినట్లు మస్క్‌ వెల్లడించారు.


ఐఎస్‌ఎస్‌‌లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అనుభవాలను గురించి తాజాగా సునీతా విలియమ్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. "అంతరిక్షంలో జీరో గ్రావిటీ కారణంగా 7 నెలలుగా నడవలేదు. కూర్చోలేదు. పడుకోలేదు. నెలల తరబడి తేలియాడుతూనే ఉన్నా. ఇంతకాలం ఇదే స్థితిలో ఉండవటం వల్ల నడిస్తే ఎలా ఉంటుందని గుర్తుతెచ్చుకోలేక పోతున్నాను. ఆ అనుభూతిని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని వెల్లడించారు ". ఓ హైస్కూల్ విద్యార్థులతో జరిగిన వర్చువల్‌ సెషన్‌లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇద్దరు వ్యోమగాములను ఐఎస్‌ఎస్‌ నుంచి తిరిగి తీసుకురావడానికి నాసా ఇప్పటికే క్రూ-9 మిషన్‌ పేరిట స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేస్తోంది. ఇదిలా ఉంటే.. బైడెన్ ప్రభుత్వం అలసత్వం వల్లే అంతరిక్షకేంద్రంలో ఇన్నాళ్ల పాటు వ్యోమగాములు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇటీవల మస్క్ విమర్శించారు. "అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను వీలైనంత త్వరగా ఇంటికి తీసుకురావాలని @POTUS @SpaceXని కోరింది. మేము అలా చేస్తాము" అని మస్క్ ఓ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు.


మస్క్ తాజా పోస్ట్ ప్రకారం.. 'ఫ్రీడమ్' అనే పేరుతో ఉన్న క్రూ డ్రాగన్ క్యాప్సూల్ (క్రూ-10) ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు ముందుగా ISSకి చేరుకుంటుంది. మార్చి చివర్లో లేదా ఏప్రిల్ తొలి వారంలో వారు భూమిపై అడుగుపెట్టే అవకాశముంది.

Updated Date - Jan 29 , 2025 | 08:04 PM