Home » Elon Musk
పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చర్చ జరిగింది. గత మంగళవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఇరాన్ విషయమై చర్చించారు.
గత మంగళవారం జరిగిన ట్రంప్-మోదీ ఫోన్ కాల్లో టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్టు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇరు దేశాధినేతలతో మస్క్ ఏం మాట్లాడారనే విషయంలో మాత్రం తెలియరాలేదు.
భూమిపై కంటే అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు సులభమని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. మరో మూడేళ్లల్లో అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటు ఊపందుకుంటుందని చెప్పారు.
ఫ్రాన్స్లోని ఎక్స్ కార్యాలయాల్లో స్థానిక అధికారులు సోదాలు నిర్వహించారు. ఎక్స్ ఆల్గోరిథమ్లో మార్పులపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ప్రాసిక్యూటర్లు తాజాగా సోదాలు చేపట్టారు.
ప్రపంచ ఆర్థికాభివృద్ధికి చైనా, భారత్లు చోదకశక్తులుగా మారాయని ఐఎమ్ఎఫ్ గణాంకాలు చెబుతున్నాయి. వీటిని ఎలాన్ మస్క్ నెట్టింట పంచుకున్నారు. పవర్ చేతులు మారుతోందని కామెంట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని శాంతిమండలిపై ఎలాన్ మస్క్ సెటైర్లు పేల్చారు. బోర్డ్ ఆప్ పీస్లో పీస్ అంటే శాంతి కాదని.. వివిధ దేశాల ముక్కలని తాను అనుకున్నట్టు వ్యాఖ్యానించారు.
కొన్ని రోజులుగా ఎక్స్లో ఇన్బిల్డ్ అయిన గ్రోక్ ఏఐ చేసిన తప్పిదం ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనాలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మస్క్కు మరో షాక్ తగిలింది.
వైద్య రంగంలో ఏఐ ప్రభావంపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ తాజాగా కీలక కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో వైద్య కళాశాలల అవసరం ఉండదని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
ఎక్స్ఏఐ సంస్థకు చెందిన గ్రోక్ చాట్బాట్పై ఇండోనేషియా ప్రభుత్వం తాత్కాలిక నిషేధం విధించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
సంక్షోభంలో కూరుకుపోయిన వెనెజువెలాకు మద్దతుగా ఎలాన్ మస్క్ రంగంలోకి దిగారు. అక్కడి ప్రజలకు ఫిబ్రవరి 3వ తేదీ వరకూ స్టార్లింక్ ద్వారా ఉచిత బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తామని తెలిపారు.