Home Minister Anitha: ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకు అధిక ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:38 AM
ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకికరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని వివరించారు. నేడు డ్రోన్ ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేస్తున్నారని అన్నారు.

అనకాపల్లి జిల్లా: అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రైతే దేశానికి వెన్నుముక అని ఉద్ఘాటించారు. రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతగానో కృషిచేస్తోందని పేర్కొన్నారు. ఇవాళ(బుధవారం) పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు.
ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో హోం మంత్రి అనిత పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ.. కాడెడ్లతో నాగలి పట్టుకొని హోం మంత్రి అనిత పొలం దున్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఉద్ఘాటించారు.
టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకికరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నామని హోంమంత్రి అనిత వివరించారు. నేడు డ్రోన్లను ఉపయోగించి, రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. 80 శాతం రాయితీపై రైతులకు డ్రోన్లు ఇస్తున్నామని ప్రకటించారు. పాడిపంటలతో ఏపీ సుభిక్షంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..
అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్...
For More AP News and Telugu News