Earthquakes in AP: ఏపీలో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - May 06 , 2025 | 11:49 AM
Earthquakes in AP: ఏపీలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో ప్రజలు భయపడిపోయారు. దీంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లాలో ఇవాళ(మంగళవారం) భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొదిలి, దర్శి, ముండ్లమూరు మండలాల్లో రెండు సెకళ్ల పాటు భూమి కంపించింది. భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. దర్శి నియోజకవర్గంలో గత ఏడాది డిసెంబర్లో వరుసగా నాలుగు రోజుల పాటు భూమి కంపించింది. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో భూగర్భంలో మార్పులు కారణంగా భూమి కంపిస్తున్నట్లుగా ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ప్రాంతాల్లో గతంలోనూ భూ ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూకంప తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులు వస్తాయోనని ప్రజలు టెన్షన్ పడుతున్నారు. భూకంపాలపై గతంలోనూ ఈ ప్రాంతాల్లో అధికారులు పరిశోధనలు చేశారు. భూగర్భంలో చిన్న చిన్న కదలికలు వచ్చినప్పుడు ఇలాంటి భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇవి భారీ భూకంపాలకు సంకేతాలుగా మారుతాయా లేదా సాధారణంగా వచ్చే ప్రకంపనలేనా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ప్రజల భద్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రజలు భయపడవద్దని, ఎలాంటి అపోహాలకు లోను కావద్దని అధికారులు చెబుతున్నారు. భూప్రకంపనలపై ప్రభుత్వం అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. భూకంపాల వేగం, తీవ్రత వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షణ జరగాలని ప్రజలు అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Deputy CM Pawan: బంగాళాఖాతంలో ఘర్షణలు
CM Chandrababu: అన్ని సేవలూ వాట్సాప్లోనే
Minister Gottipati Ravi Kumar: విద్యుత్ ఒప్పందాలపై అసత్య ప్రచారం
For More AP News and Telugu News