YSRCP: రెచ్చిపోయిన వైసీపీ కీలక నేత.. ఏం చేశారంటే..
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:41 PM
దళిత పాత్రికేయుడు తోకల శ్రీనుపై కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రామిరెడ్డి వ్యాఖ్యలపై నెల్లూరు పోలీసులకు దళిత, ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

నెల్లూరు: వైసీపీ నేతలు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలు మీతిమిరి ప్రవర్తించారు. కూటమి ప్రభుత్వంలోనూ వారి చర్యలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కూటమి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ జగన్ పార్టీ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి, అతని అనుచరులు రెచ్చిపోయారు. పాత్రికేయులని వైసీపీ నేతలు అసభ్య పదజాలంతో ధూషించారు. బట్టలూడదీసి కొడతామంటూ పాత్రికేయులపై బహిరంగంగా బెదిరింపులకు దిగారు. దళిత పాత్రికేయుడు తోకల శ్రీనుపై (Tokala Srinu) కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి (YSRCP Leader RamiReddy) అనుచిత వ్యాఖ్యలు చేశారు.
గత జగన్ ప్రభుత్వంలో రామిరెడ్డి తన నివాసం ఎదుట ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహారీ నిర్మాణం చేశారు. అక్కడ అంబేద్కర్ స్మారక భవనం నిర్మించాలని ఇటీవల తోకల శ్రీను సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. శ్రీను పోస్టింగ్పై రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తోకల శ్రీనుపై అవమానకరంగా వైసీపీ నేత వ్యాఖ్యలు చేశారు. ’తోకల శ్రీను... తోక ఉందో, లేదో తెలియదు. ఇక్కడకి రారులే... ఎక్కడ లిస్టులో చేరుస్తామోననే భయం, గుడ్డలూడదీసి కొడతాం’ అంటూ రామిరెడ్డి అవహేళనగా మాట్లాడుతూ బెదిరింపులకు దిగాడు. రామిరెడ్డి వ్యాఖ్యలపై దళిత, ప్రజాసంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన తన అభ్యంతరకరమైన మాటలతో దళిత పాత్రికేయులపై చిల్లర విమర్శలకే కాకుండా, బెదిరింపులకు దిగడం, అసభ్యపదజాలంతో వారిని అవమానించటం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. రామిరెడ్డి వ్యాఖ్యలపై నెల్లూరు పోలీసులకు దళిత, ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇవి కూడా చదవండి
మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం
Read Latest AP News And Telugu News