Home » Nellore politics
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మొదటి రోజు విచారణ ముగిసింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణిని గుంటూరు సీఐడీ పోలీసులు అప్పగించారు. రేపు రెండోరోజు విచారణ కొనసాగనుంది. వైసీపీ ప్రభుత్వంలో భూముల రికార్డుల తారుమారు కేసులో A-14గా కాకాణి గోవర్ధన్రెడ్డి ఉన్నారు. ఆ కేసుకి సంబంధించి కాకాణిని సీఐడీ పోలీసులు 26 ప్రశ్నలు సంధించారు.
క్వార్ట్జ్ కుంభకోణం కేసు విచారణలో వైసీపీ ముఖ్య నేతల భాగోతాలు బయటకొస్తున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భారీ అక్రమాలు బయటపడ్డాయి. మాజీ మంత్రులు అనిల్ కుమార్, కాకాణి గోవర్థన్రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వైసీపీ అధినేత జగన్ మెప్పు, బిస్కెట్ల కోసం ఆ పార్టీ నేతలు అనిల్ కుమార్ ప్రసన్నకుమార్ రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని సినీ నటుడు కిరాక్ ఆర్పీ ధ్వజమెత్తారు. ఆడవాళ్ల జోలికొచ్చినా, కించపరిచినా బాగుపడే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ప్రసన్న, అనిల్ కుమార్ పతనం ప్రారంభమైందని కిరాక్ ఆర్పీ విమర్శించారు.
కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పథకాలను వరుసగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
జగన్ పార్టీనే క్రిమినల్ మైండ్ పార్టీ అని మంత్రి నారాయణ విమర్శించారు. యావత్ దేశం సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు మాట్లాడిన మాటలను ఖండించాలని మంత్రి నారాయణ అన్నారు.
దళిత పాత్రికేయుడు తోకల శ్రీనుపై కావలి వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రామిరెడ్డి వ్యాఖ్యలపై నెల్లూరు పోలీసులకు దళిత, ప్రజాసంఘాలు ఫిర్యాదు చేశాయి. రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Minister Narayana: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఏపీకి చాలా నష్టం చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థంగా పనులు చేశారని మంత్రి నారాయణ విమర్శించారు.
MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.
Kavali Pylon Toppling Case: కావలిలో అమృత్ పథకంలో భాగంగా పైలాన్ కూలదోసిన కేసులో నలుగురిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల విచారణలో పలుకీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.