Share News

MLA Gadde Rammohan: డ్రగ్స్, గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:30 AM

నేడు యువత ఎక్కువుగా డ్రగ్స్, గంజాయికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. డ్రగ్స్ వల్ల ఆ కుటుంబమే కాదు.. సమాజంపై కూడా ప్రభావం పడుతోందని తెలిపారు.

MLA Gadde Rammohan: డ్రగ్స్, గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం
MLA Gadde Rammohan

విజయవాడ: కూటమి ప్రభుత్వం డ్రగ్స్ (Drugs), గంజాయిని ఉక్కుపాదంతో అణచివేస్తోందని విజయవాడ తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (MLA Gadde Rammohan) తెలిపారు. డ్రగ్స్ వల్ల ఆ కుటుంబమే కాదు.. సమాజంపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. నేడు యువత ఎక్కువుగా డ్రగ్స్, గంజాయికి బానిసలు కావడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇవాళ(ఆదివారం) విజయవాడలో మారథాన్ రన్ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ఈ మారధాన్ జరిగింది.


ఇస్కాన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కోసం వాక్‌థాన్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారి ఆయుష్షు కూడా తరిగిపోతుందని చెప్పారు. జీవితంలో యువత ఎందుకూ పనికి రాకుండా పోతున్నారని అన్నారు. కొంతమంది ధన దాహానికి అమాయకుల జీవితాలను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ఈగల్ టీంను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఏపీలో గత ఐదేళ్లుగా గంజాయి, డ్రగ్స్ రవాణా పెరిగిపోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో డ్రగ్స్, గంజాయి రవాణాను నిరోధించామని అన్నారు. ప్రజల్లో కూడా వీటిపై మరింత చైతన్యం రావాలని చెప్పుకొచ్చారు. నో డ్రగ్, నో ఎడిక్షన్ అనే నినాదం అందరిలో ఉండాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు.


డ్రగ్స్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు: ఐజీ, ఈగల్ టీం హెడ్ రవికృష్ణ

డ్రగ్స్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఐజీ, ఈగల్ టీం హెడ్ రవికృష్ణ అన్నారు. ఈ చర్యల్లో భాగంగా ఈగల్ టీంను ఏర్పాటు చేసిందని తెలిపారు. మత్తు పదార్థాలకు సంబంధించి సమాచారం తెలిస్తే 1972కి కాల్ చేయాలని సూచించారు. ప్రతి తల్లి ఈగల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ తమ‌ పిల్లలు మత్తుకు బానిసలు కాకుండా చూడాలని రవికృష్ణ కోరారు.


యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలి: ఇస్కాన్ ప్రతినిధి చక్రధార్

ఇస్కాన్ ఆధ్వర్యంలో మత్తు పదార్ధాల వల్ల‌ కలిగే నష్టాలను వివరిస్తున్నామని ఇస్కాన్ ప్రతినిధి చక్రధార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈగల్ పేరుతో ఒక టీంను ఏర్పాటు చేసిందని అన్నారు. నేడు యువత త్వరగా మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుతున్నారని చెప్పారు. జగన్నాధ రథయాత్ర సందర్భంగా తమవంతుగా సమాజ శ్రేయస్సు కోసం‌ కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు. మత్తు జీవితాలను చిత్తు చేస్తోందని చెప్పడానికే ఈ మారథాన్ రన్ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకుని, మత్తు పదార్ధాలకు దూరంగా ఉండాలని ఇస్కాన్ ప్రతినిధి చక్రధార్ కోరారు.


ఇవి కూడా చదవండి:

విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు

19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో

For More AP News and Telugu News

Updated Date - Jun 15 , 2025 | 10:48 AM