Share News

YSRCP: కుమ్ములాటలకు కేరాఫ్ వైసీపీ.. వర్గవిభేదాలతో తన్నుకుంటున్న నేతలు

ABN , Publish Date - Jun 02 , 2025 | 08:54 AM

గత కొంతకాలంగా మనోహర్ వర్గం, తన్నీరు నాగేశ్వరరావు వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీలోని నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో హై కమాండ్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం అంతగా విజయవంతం చేయలేకపోతున్నారని స్థానిక కేడర్ తెలిపారు.

YSRCP: కుమ్ములాటలకు కేరాఫ్ వైసీపీ.. వర్గవిభేదాలతో తన్నుకుంటున్న నేతలు
YSRCP Group Fght

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో పార్టీకి సంబంధించిన అంతర్గత విభేదాలు మరింత తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా జగ్గయ్యపేట (Jaggayyapet) నియోజకవర్గంలో వైసీపీ నాయకుల మధ్య నెలకొన్న వర్గపోరు పతాకస్థాయికి చేరింది. దీనివల్ల ఆ పార్టీ పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోంది. జగ్గయ్యపేటలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ కీలక నేత మనోహర్ ఆలస్యంగా వచ్చే సరికి ఓ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ విషయంలోనే రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. దీంతో రెండువర్గాలు తలపడ్డాయి. మనోహర్ వర్గీయుడు వినోద్‌పై తన్నీరు నాగేశ్వరరావు వర్గీయులు దాడి చేశారు.


మనోహర్ ఆలస్యంగా సమావేశానికి రావడంతోనే తన్నీరు నాగేశ్వరరావు ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారని అతని వర్గం నేతలు చెబుతున్నారు. ఈ విషయంపై మనోహర్ సీరియస్ అయ్యారు. ఈక్రమంలో తనను వాట్సాప్ గ్రూప్ నుంచి ఎందుకు తొలగించారు అంటూ తన్నీరు నాగేశ్వరరావు అనుచరుడు రవిని మనోహర్ నిలదీశారు. ఇదే సమయంలో మనోహర్ పక్కనే ఉన్న వినోద్‌పై తన్నీరు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనతో ఇరువర్గాలు పోటాపోటీగా తన్నుకున్నాయి. అనంతరం పోలీస్ స్టేషన్ వరకు ఈ వ్యవహారం వెళ్లింది. ఈ ఇద్దరి నేతల వర్గపోరు వ్యవహరంతోొ జగ్గయ్యపేటలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.


గత కొంతకాలంగా మనోహర్ వర్గం, తన్నీరు నాగేశ్వరరావు వర్గం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీలోని నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో హై కమాండ్ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమం అంతగా విజయవంతం చేయలేకపోతున్నారని స్థానిక కేడర్ చెబుతున్నారు. ఈ రెండు వర్గాల విభేదాలు పార్టీని నష్టపరుస్తున్నాయని కార్యకర్తలు అంటున్నారు. పార్టీ అధిష్టానం ఏ కార్యక్రమం చేపట్టినా ఒక వర్గం మరో వర్గాన్ని కలుపుని వెళ్లడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. కొంతకాలంగా ఈ రెండు వర్గాల కొట్లాటతో కార్యకర్తలు వైసీపీని వీడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా వైసీపీ హై కమాండ్ జగ్గయ్యపేట నియోజకవర్గంలో వర్గవిభేదాలు లేకుండా పరిష్కరించాలని కార్యకర్తలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఉపాధ్యాయుడు మందలించడం.. ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదు

పారిశ్రామిక హబ్‌గా ఏపీ

For More AP News and Telugu News

Updated Date - Jun 02 , 2025 | 09:15 AM