Huge Drugs: ఏపీలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. వాటి విలువ తెలిస్తే..
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:10 PM
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

విజయవాడ: నగరంలో పోలీసులు ఇవాళ(గురువారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ (Drugs) తరలిస్తున్న ముఠాను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు రూ. 2లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాకు విజయవాడ డీసీపీ సరిత (Vijayawada DCP Saritha) వివరాలు వెల్లడించారు. మాదక ద్రవ్యాల రవాణాపై ఏపీ ప్రభుత్వం (AP Govt) ఉక్కుపాదం మోపుతోందని విజయవాడ డీసీపీ సరిత వ్యాఖ్యానించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయడంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణా నిరోధించే చర్యలు చేపట్టామని అన్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా MDMA డ్రగ్స్ దొరికాయని చెప్పారు. ఈ డ్రగ్స్ తీసుకొవడంతో అతిగా ప్రవర్తిస్తారని అన్నారు. వాహనాల తనిఖీ సమయంలో ముగ్గురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకెళ్తున్నట్లు గుర్తించామని తెలిపారు విజయవాడ డీసీపీ సరిత.
ఏసీపీ దామోదర్, సీఐ పవన్ కిషోర్లు నిందితులను విచారణ చేసి అరెస్టు చేశారని విజయవాడ డీసీపీ సరిత వెల్లడించారు. తిరుమలశెట్టి జీవన్ కుమార్, నితీష్ కుమార్, ప్రసాద్లను అరెస్టు చేశామని వివరించారు. 33 గ్రాముల డ్రగ్స్ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. యూనివర్శిటీలో విద్యార్థులకు ఈ డ్రగ్స్ అమ్ముతున్నట్లు విచారణలో తేలిందని అన్నారు. ఈ తరహా డ్రగ్స్, గంజాయి ఎక్కడ నుంచి తెస్తున్నారు, ఎక్కడకు చేర్చుతున్నారనే అంశాలపై దృష్టి పెట్టామని చెప్పారు. ఈరోజు దొరికిన MDMA డ్రగ్స్ కొరియర్లో ప్యాక్ చేసి పంపారని అన్నారు. అది పైకి ప్యాకెట్ లాగానే ఉంటుందని.. లోపల చూస్తే డ్రగ్స్ ఉన్నట్లు అర్ధం అవుతోందని తెలిపారు. ఇలాంటి డ్రగ్స్ రవాణా చేసినా, సేవించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గంజాయి రవాణాపై ఇప్పటికే పీడీ యాక్ట్ కేసులు పెట్టామని అన్నారు. ఇప్పుడు కొత్తగా క్విట్ అండ్ పీటీ యాక్ట్ అమల్లోకి వచ్చిందని చెప్పారు. NDPTS కింద నిందితులపై పలు కేసులు నమోదయ్యాయన్నారు. బైక్ దొంగతనాలు చేసి, వాటి ద్వారా గంజాయి రవాణా చేస్తున్నారని తెలిపారు. బైక్లు చోరీకి గురైనా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు విజయవాడ డీసీపీ సరిత.
ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు చెప్పాలని విజయవాడ డీసీపీ సరిత కోరారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రగ్స్కు బానిస కావద్దు, జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. డ్రగ్స్ చేరవేసినా కూడా కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు ఈవ్టీజింగ్ అరికట్టిన విధంగా కాలేజ్ల్లో డ్రగ్స్ని అరికట్టాలని సూచించారు. ఈగల్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని పోలీసులు సమన్వయంతో పని చేయాలని కోరారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలన్న ఏపీ ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పోలీసులు పని చేస్తున్నారని అన్నారు. ప్రజలు కూడా ఈ తరహా అంశాలపై అవగాహన పెంచుకుని పోలీసులకు సహకారం అందించాలని కోరారు. ఈ ముఠా వెనుక కొంతమంది ఉన్నారని.. దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. డీటీడీసీ కొరియర్ ద్వారా ఈ డ్రగ్స్ పార్సిల్ వచ్చింది కాబట్టి.. సిబ్బంది పాత్ర పైనా విచారణ సాగుతోందని వెల్లడించారు. అన్ని విషయాలు ఇప్పుడే పూర్తిగా చెప్పలేమని అన్నారు. ఈ డ్రగ్స్ ఢిల్లీ నుంచి వచ్చింది.. అక్కడ నుంచి ఎవరు పంపుతున్నారు.. ఇక్కడ ఎవరికి చేరవేస్తున్నారనే అంశాలపై విచారణ చేస్తున్నామని విజయవాడ డీసీపీ సరిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములవ్వండి.. సీఎం చంద్రబాబు పిలుపు
జగనన్నా.. మాకు దిక్కెవరన్నా.. నెల్లూరులో ఫ్లెక్సీల కలకలం
Read Latest AP News And Telugu News