TDP Mahanadu 2025: టీడీపీ హై కమాండ్ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..
ABN , Publish Date - May 16 , 2025 | 06:08 PM
TDP Mahanadu 2025: కడప జిల్లాలో మే27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడును (Mahanadu) ఈ నెల 18,19, 20 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించాలని తెలుగుదేశం హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22, 23 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో మహానాడు నిర్వహించాలని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) ఆ పార్టీ నేతలకు సూచనలు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ తీర్మానాలను 21వ తేదీలోపు, పార్లమెంట్ నియోజకవర్గ తీర్మానాలను ఈ నెల 24వ తేదీలోపు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు ఇవాళ(శుక్రవారం) ఓప్రకటన విడుదల చేశారు.
కడప గడ్డలో పసుపు పండుగ: శ్రీనివాసుల రెడ్డి
కడప గడ్డలో మహానాడు పసుపు పండుగ జరుగనుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసుల రెడ్డి అన్నారు. మహానాడు పండుగకు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 27, 28వ తేదీల్లో ప్రతినిధుల సభ జరుగుతుందని చెప్పారు. 29వ తేదీ భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. ఈ సభకు దాదాపుగా 5 లక్షల మంది రావచ్చని అంచనా వేశారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నా, అన్ని హోటల్స్ కల్యాణ మండపాలను తీసుకున్నట్లు చెప్పారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవని స్పష్టం చేశారు. 10 నియోజకవర్గాల్లో కూడా మినీ మహానాడు కార్యక్రమాలు జరుగుతాయని శ్రీనివాసుల రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News