Home » Palla Srinivasa Rao
తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలకు గుంపులుగా రావద్దని వైసీపీ నేతలకు తిరుపతి పోలీసుల సూచించారు. టీటీడీ గోశాలలో గోవుల మృతికి సంబంధించి కూటమి ప్రజా ప్రతినిధులు.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సవాళ్లపై పోలీసు శాఖ గురువారం ఈ ప్రకటన విడుదల చేసింది. కార్యకర్తలతో కాకుండా గన్ మెన్లతో గోశాలను సందర్శించి, మీడియాతో మాట్లాడి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెళ్లిపోవాలని భూమన కరుణాకరరెడ్డికి పోలీసులు సూచించారు.
Palla Srinivasa Rao: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం టీడీపీకి సమస్యగా మారింది. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ నేత రమేష్ రెడ్డి, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈరోజు తిరువూరు నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు మంగళగిరి పార్టీ కార్యాలయానికి రావడంతో చర్చనీయాంశంగా మారింది.
Palla Srinivas Speech: తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అనేక సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేసిన పార్టీ అని పల్లా శ్రీనివాస్ అన్నారు. 40 ఏళ్లుగా అన్న ఎన్టీఆర్ ఆశయాలను భుజస్కంధాలపై మోస్తూ పార్టీని అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్పిన మాజీ సీఎం జగన్, కేవలం పది నిమిషాలపాటు అసెంబ్లీలో డ్రామా ఆడి వెళ్లిపోయారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారంతా జగన్ తీరుపై ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి తీసుకెళుతున్న సీసీ కెమెరా ఫుటేజీని విడుదల చేశారు.
TDP Leaders: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ నేతలు మండిపడ్డారు. జైలులో ఉన్న వంశీని వైఎస్ జగన్ పరామర్శించడంతోపాటు బయట మీడియాతో మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జగన్ తల్లిని, చెల్లి పుట్టుకపై విమర్శలు చేసిన వర్రా రవీంద్ర రెడ్డి సైతం జైలులో ఉన్నాడని.. వెళ్లి అతన్ని కూడా పరామర్శిస్తావా ? అంటూ వైఎస్ జగన్ను సూటిగా ప్రశ్నించారు.
TDP: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కామేపల్లి తులసిబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే తులసిబాబు... గుడివాడ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉంటూ సమాంతరంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ స్పందించింది.
Palla Srinivas Rao:జగన్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు పారిపోయేలా చేశారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్రావు ఆరోపించారు. వైసీపీ నేతలు రెడ్బుక్ చూస్తుంటే భయపడుతున్నారని అన్నారు. తప్పుచేసిన వైసీపీ నేతలను, అధికారులను వదలబోమని పల్లా శ్రీనివాస్రావు హెచ్చరించారు.
ఉప ముఖ్యమంత్రి పదవి విషయంలో వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాల వలలో పడొద్దని తమ నేతలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ...
Palla Srinivasa Rao: టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్రావు తెలిపారు. యువగళం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారని ఉద్ఘాటించారు.