APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు.. విచారణ వేగవంతం
ABN , Publish Date - May 25 , 2025 | 07:00 PM
APPSC Case: ఏపీపీఎస్సీ అక్రమాల కేసు విచారణలో ఏపీ పోలీసులు స్పీడ్ పెంచారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కేసుకు సంబంధం ఉన్న వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఏ2 మధుసూదన్లను విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

విజయవాడ: ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో (APPSC irregularities Case) ఏ1 ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు, ఏ2 మధుసూదన్లను అధికారులు విచారణ చేస్తున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వీరిద్దరిని పోలీసులు విచారించారు. దీంతో ఆ ఇద్దరికీ తొలిరోజు కస్టడీ పూర్తి అయింది. ఇవాళ రాత్రికి కూడా సూర్యారావుపేట పోలీస్ స్టేషనులోనే నిందితులు పీఎస్సార్, మధు ఉండనున్నారు. పీఎస్సార్పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.
సుమారు 30కు పైగా ప్రశ్నలను పోలీసులు వీరిద్దరిని అడిగారు. గ్రూప్1 మెయిన్ పరీక్ష మూల్యాంకనం శాస్త్రీయ పద్ధతిలో చేయకుండా చేసినట్లుగా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. సైన్ మీడియా సంస్థకు ఏ విధంగా కాంట్రాక్టు కట్టబెట్టారని అడిగారు. ఆ సంస్థకు నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం లేకపోయినా ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారని నిలదీశారు. ఆ సంస్థ డైరెక్టర్ ఏ2 మధుసూదన్ పాత్ర ఇందులో ఏంటని ప్రశ్నించారు. మధుసూదన్కి మీకు పరిచయం ఏంటి.. ఎప్పుడు ఎలా కలిశారని ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులను నిలదీశారు.
రూ. 1.14 కోట్లు సైన్ మీడియా సంస్థకు చెల్లించగా 60 లక్షలు ఎలా మిగిలాయని.. ఆ డబ్బు ఏం చేశారని పీఎస్సార్పై ప్రశ్నల వర్షం కురిపించారు. మధుసూదన్ను కూడా పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. మూల్యాంకనం సందర్భంగా డబ్బులు లెక్కించినట్లుగా చెబుతున్న వారిలో 25 మంది వివరాలు లేవని చెప్పారు. వారు ఎవరు, వారికి ఏ ప్రాతిపదికన చెల్లింపులు చేశారని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం లేని వారిని కూడా ఎందుకు హాయ్ల్యాండ్లోకి మూల్యాంకనం సమయంలో అనుమతి ఇచ్చారని అడిగారు. పీఎస్సార్కు మీకు ఉన్న సంబంధాలు ఏంటని మధుసూదన్ను పోలీసులు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం
For More AP News and Telugu News