Share News

MLC Anuradha: జగన్ హయాంలో కార్మిక వ్యవస్థని నిర్వీర్యం చేశారు

ABN , Publish Date - May 01 , 2025 | 02:51 PM

MLC Anuradha: జగన్ హయాంలో కార్మికులను పట్టించుకోలేదని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు.

MLC Anuradha: జగన్ హయాంలో కార్మిక వ్యవస్థని నిర్వీర్యం చేశారు
MLC Anuradha

అమరావతి: కార్మికులకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయే అని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. ఇవాళ(గురువారం) టీడీపీ కేంద్ర కార్యాలయంలో 139వ మేడే వేడుకలు నిర్వహించారు. టీడీపీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ శాసనమండలి సభ్యులు షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడారు. కోటి మంది కార్మికులకు సీఎం చంద్రబాబు భీమా సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు. కార్మికుల చిహ్నం పార్టీ జెండాలోనే ఉందని అన్నారు. జగన్ హయాంలో కార్మిక వ్యవస్థని నిర్వీర్యం చేశారని విమర్శించారు. 30 లక్షల మంది కార్మికులను జగన్ హయాంలో రోడ్డుపైన పడవేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కార్మిక వ్యవస్థ తిరిగి ఊపిరి పోసుకుంటుందని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు.


అమరావతి నిర్మాణం వైసీపీకి చెంప పెట్టు: పరుచూరి అశోక్ బాబు

అమరావతి: అమరావతి నిర్మాణం వైసీపీకి చెంప పెట్టు అని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత పరుచూరి అశోక్ బాబు ఆరోపించారు. రేపు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు అని ఉద్ఘాటించారు. జగన్ రెడ్డికి ధైర్యం ఉంటే ప్రధాని మోదీ సభకు వచ్చి ఆయన చేసిన తప్పును సరిదిద్దుకోవాలని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిని చూడలేక జగన్ రెడ్డి కళ్లు మూసుకొని చీకటి గదిలో గడపాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పారు. జగన్ రెడ్డి, ఆపార్టీ చేసే ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రెక్కలు తెగిన పక్షిలా అమరావతిని ముక్కలు చేసి మూడు రాజధానుల పేరుతో జగన్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి దేశంలోనే అత్యుత్తమమైన రాజధానిగా రూపుదిద్దుకుంటుందని పరుచూరి అశోక్ బాబు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం

Home Minister Anitha: పవన్ మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి

CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..

పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్‌ ఖర్చు తక్కువ

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 02:58 PM