Minister Nadendla Manohar: రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ.. మంత్రి నాదెండ్ల కీలక సూచనలు
ABN , Publish Date - May 30 , 2025 | 08:21 PM
కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రేషన్ డీలర్లు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా పనిచేయాలని సూచించారు మంత్రి నాదెండ్ల మనోహర్.

అమరావతి: రేషన్ డీలర్లు (Ration Dealers) కార్డుదారులకు గౌరవంగా సేవలందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) సూచించారు. ఇవాళ(శుక్రవారం) ఏపీ సచివాలయంలో తన చాంబర్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కీలక సూచనలు జారీ చేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో అవకతవకలు లేకుండా రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు జూన్ 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రేషన్ డీలర్లు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు వచ్చేలా పనిచేయాలని సూచించారు. రేషన్ దుకాణాల పరిశరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. సరైన కొలతలతో సరుకులు పంపిణీ చేయాలని, ధరలు, స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ దుకాణదారుడు విదిగా ఈ- పోస్ బరువు, స్కేల్ మిషన్ పనితీరు సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వారికి రేషన్ పంపిణీ ఇంటి వద్దే జరుగుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దే రేషన్ అందించేందుకు చొరవ చూపాలని కోరారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందించి కార్డుదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరుకు పంపిణీ చేయాలి కానీ అపకూడదని ఆదేశించారు. ఈ- పోస్, వేయింగ్ మిషన్ల రిపేర్లకు సర్వీస్ క్యాంపులు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేస్తామని.. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీలర్లు 1వ తేదీ నుంచే రేషన్ పంపిణీపై సర్వసన్నద్దంగా ఉండాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.
ఇవి కూడా చదవండి
ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
ఫేస్బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు
Read Latest AP News And Telugu News