Nandamuri Balakrishna: రాయలసీమ గడ్డ నా అడ్డా.. వైసీపీకి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - May 05 , 2025 | 01:40 PM
Nandamuri Balakrishna: వైసీపీకి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తాటతీస్తానని హెచ్చరించారు. హిందూపురం ప్రజలకు తాను అండగా ఉంటానని బాలకృష్ణ భరోసా కల్పించారు.

శ్రీ సత్యసాయి జిల్లా: రాయలసీమ గడ్డ తన అడ్డా అని వైసీపీ నేతలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వైసీపీ నేతలను బాలకృష్ణ హెచ్చరించారు. ఇవాళ(సోమవారం) హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హిందూపురం మండలం ఇందిరమ్మ కాలనీలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు హిందూపురం అంటే రెండో పుట్టినిల్లుగా భావించేవారని నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ అంటే ఒక జవాబుదారి పార్టీగా పేరుగాంచిందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఒక విజనరీ ఉన్న లీడర్ అని కొనియాడారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే హిందూపురంలో రూ. 50 కోట్ల నిధులతో పనులు చేయించానని గుర్తుచేశారు. హిందూపురంలో శాశ్వత తాగునీటి పథకానికి రూ. 136 కోట్ల నివేదికలు సిద్ధం చేశామని అన్నారు. మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని తెలిపారు. 1984లోనే ఎన్టీఆర్ తూముకుంట వద్ద పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడం.. హిందూపురం ప్రజలు మర్చి పోలేనిదని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
AP NEWS: కావలిలో పైలాన్ కూలదోసిన కేసులో నలుగురు అరెస్ట్
Tirumala: కాలినడక భక్తుల కోసం ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు..
Nara Lokesh: బకింగ్ హాంలో గుర్రపుడెక్కను తొలగించండి
టెల్అవీవ్ విమానాశ్రయ సమీపంలో క్షిపణి దాడి
For More AP News and Telugu News