Home » Hindupur
హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలను జన్మనిచ్చారు. వీరిలో ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు, వారి బరువు తక్కువ కావడంతో అనంతపురానికి రెఫర్ చేశారు
హంద్రీనీవా కాలువకు మళ్లీ గండిపడింది. మండల కేంద్రం సమీపంలోని నక్కలగుట్ట కాలనీ వద్ద గురువారం ఉదయం మడకశిర ఉప కాలువకు గండిపడింది. దీంతో చాకర్లపల్లి కుంటకు, అక్కడి నుంచి చల్లాపల్లి చెరువు నిండి నాగలూరు చెరువుకు నీరు చేరింది.
పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఆలస్యమౌతోంది. ఒంటిపూట బడి నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలో ఉంటున్నారు.
అనంతపురం మీదుగా ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ నియంత్రణకు నరసాపూర్-అరిసికెర-నరసాపూర్ (వయా అనంతపురం) ప్రత్యేక వీక్లీ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న వారు బయటికి వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు.
ఎంజీఎం పాఠశాల హెచఎం సామ్రాజ్యంపై గతంలో కొందరు చేసిన ఫిర్యాదులపై డీవైఈఓ పద్మప్రియ విచారణ అధికారిగా గురువారం పాఠశాలకు వచ్చారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, విద్యాశాఖ మంత్రి పేషీ నుంచి డీఈఓకు ఆదేశాలు అందగా ఆయన డీవైఈఓకు బాధ్యతలు అప్పగించినట్లు ఆమె తెలిపారు.
సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మున్సిపల్ చైర్మన డీఈ రమే్షకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు.
మతసామరస్యానికి ప్రతీక పెనుకొండ అని హిందూ, ముస్లిం, జైన మతస్థులకు నిలయంగా వెలుగొందుతోందని మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పశ్చాపార్వ్శనాథస్వామి జైన ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఓ తాగుబోతు చేసిన పనికి ఆర్టీసీ బస్ డ్రైవర్ గుండెలు జల్లుమన్నాయి. అంతలా ఆ తాగుబోతు డ్రైవర్ను భయపెట్టేశాడు. రోడ్డుపై వెళుతున్న వాహనదారులు సమాచారం ఇవ్వకపోయి ఉంటే ఆ తాగుబోతు ప్రాణాలు రిస్క్లో పడేవి..
కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా సాగింది. రథోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.