Home » Peddi Reddi Ramachandra Reddy
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో బుగ్గ మఠం భూముల విషయంపై ఊరట లభించలేదు. దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ శాఖకు చెందిన అపిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లాలని హైకోర్టు సూచించింది.
31 మండలాలున్న చిత్తూరు జిల్లాలో మరో 5 మండలాలు తగ్గిపోనున్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని 5 మండలాలను మదనపల్లె రెవెన్యూ సబ్ డివిజన్లో కలపనున్నారు. ఇటీవల రెవెన్యూ శాఖ పెట్టిన ప్రతిపాదన మేరకు మండలాలను విభజిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసేందుకు మంగళవారం రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తిరుపతి : వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాత్రూంలో కాలిజారిపడి తీవ్రగాయాలయ్యాయి.
తిరుపతిలోని మారుతీనగర్లో పెద్దిరెడ్డి నివాసానికి ఆనుకుని ఉత్తరం, తూర్పు, వాయవ్య దిశల్లో బుగ్గ మఠానికి భూములున్నాయి.
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు, జాయింట్
Nagababu: అవినీతి చేసిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని జనసేన అగ్రనేత నాగబాబు హెచ్చరించారు. వైసీపీ ఖాళీ అయిపోతోంది.. వచ్చే ఎన్నికల్లోపు ఆ పార్టీలో ఎవరూ ఉండరని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Minister Anagani Sathya Prasad: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళంపేట అటవీ శాఖ భూ ఆక్రమణలపై రెండు వారాల వ్యవధిలో నివేదిక వస్తుందని తేల్చిచెప్పారు.అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబంపైనా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
Panchumarthy Anuradha: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఫైల్స్ తగలబడిన ఘటనతో తనకేమీ సంబంధం లేదన్న పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పుంగనూరు ఓటర్ లిస్ట్ కంటే పెద్దిరెడ్డి పాపాల లిస్టే ఎక్కువన్నారు. 75 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవడమే కాక దర్జాగా అడవిలోకి రోడ్డు వేసుకొని ప్యాలెస్ కట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై నిగ్గు తేల్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. అటవీ భూముల భక్షణపై పూర్తి స్థాయి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణకు జాయింట్ కమిటీ ఏర్పాటైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా.. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసి.. ఇంతవరకు అసెంబ్లీకి రాకపోయినా.. పీఏసీ ఛైర్మన్ పదవి కావాలంటూ గురువారం ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు.