Peddireddy : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో దక్కని ఊరట..
ABN , Publish Date - May 22 , 2025 | 06:47 PM
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో బుగ్గ మఠం భూముల విషయంపై ఊరట లభించలేదు. దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ శాఖకు చెందిన అపిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లాలని హైకోర్టు సూచించింది.

అమరావతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో బుగ్గ మఠం భూముల విషయంలో ఊరట లభించలేదు. దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులపై ఏమైన అభ్యంతరాలు ఉంటే ఆ శాఖకు చెందిన అపిలేట్ ట్రిబ్యునల్కు వెళ్లాలని హైకోర్టు సూచించింది. కాగా, తిరుపతికి సమీపంలోని ఎంఆర్ పల్లిలో ఉన్న బుగ్గ మఠంకు చెందిన 3.88 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఆ భూములను ఖాళీ చేయాలని పెద్దిరెడ్డికి దేవాదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. అయితే, బుగ్గ మఠం భూముల విషయంలో దేవాదాయ శాఖ జోక్యం చేసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పెద్ది రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు.. దేవాదాయ శాఖ ఇచ్చిన నోటీసులపై అభ్యంతరాలు ఉంటే ఆ శాఖకు సంబంధించిన ట్రిబ్యునల్కు వెళ్లాలని సూచించింది.
Also Read:
Harish Rao Met KCR: నోటీసులపై ఏం చేద్దాం.. మామ-అల్లుడు మంతనాలు
CM Chandrababu: ఢిల్లీలో రెండురోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన
For More Telugu And National News