Home » Jaggareddy
ఈటల రాజేందర్.. నువ్వు బీజేపీ ఎంపీవా? బీఆర్ఎస్ నేతవా? అని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిలదీశారు. గతంలో పీసీసీ చీఫ్గా చేసినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ఒక్కటే విధానంతో ఉన్నారని తెలిపారు.
పాకిస్థాన్తో యుద్ధం విషయంలో అమెరికాకు తలొగ్గిన చరిత్ర మోదీదైతే.. ఆ అమెరికానే ఎదిరించి, పాకిస్థాన్ తలను వంచిన ఘనత ఇందిరా గాంధీది అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
ఇందిరాగాంధీ, నెహ్రూల చరిత్ర తెలియని బీజేపీ నేతలు.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
రఘునందన్ ఇంకోసారి రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే తమ ప్రతాపం చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హెచ్చరించారు. బీజేపీ నేతలు చిల్లరగా మాట్లాడితే తాను ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ చరిత్ర గురించి రఘునందన్కి ఏం తెలుసని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ను దేవుడంటూనే ఆయన కొంప ముంచుతోందని, రాష్ట్రంలో బీజేపీకి బలం చేకూరేలా చేస్తోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కవిత లేఖపై తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. ఆయన ఏమన్నారంటే..
గుల్జార్ హౌజ్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలోనే సీఎం రేవంత్రెడ్డి అలర్ట్ అయి.. జీహెచ్ఎంసీ అధికారులను అలర్ట్ చేశారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు.
ఇండియా అంటేనే ఇందిర. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరూ ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒక రకంగా.. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కంటే 1971లో పాకిస్థాన్తో ఇందిరాగాంధీ చేసిన యుద్ధం గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతోంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీలపై మరోమారు మళ్లీ నోరు జారితే బట్టలిప్పి నడిరోడ్డుపై గుంజీలు తీయిస్తానంటూ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హెచ్చరించారు.
బీజేపీ ఎంపీ రఘునందన్ వ్యాఖ్యలపై తూర్పు జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోదీపై విమర్శలు చేయాల్సిన పరిస్థితిని రఘునందన్ తెచ్చారని ధ్వజమెత్తారు.