Home » Indians
ఇరాన్ నుంచి ఇంతవరకూ 2,295 మంది భారతీయులను వెనక్కి తీసుకు వచ్చినట్టు రణ్ధీర్ జైశ్వాల్ చెప్పారు. వీరితో పాటు ఇజ్రాయెల్లో నివసిస్తున్న 165 మంది భారతీయులను ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన సి-17 మిలటరీ రవాణా విమానంలో భారత్కు తీసుకువచ్చారు.
అమెరికా చట్టాలకు అనుగుణంగా దరఖాస్తుదారుల సామాజిక మాధ్యమాలను పరిశీలించేందుకు అనుగుణంగా మార్పులు చేయాలని ఇండియాలోని యూఎస్ ఎంబసీ ఆ ప్రకటనలో పేర్కొంది.
ఇరాన్లో చిక్కుకున్న తమ పిల్లల పరిస్థితి ఏవిధంగా ఉందో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న వారి తల్లిదండ్రులు 'ఆపరేషన్ సింధు' పేరుతో వారిని భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్లో ఉంటూ స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులను వెనక్కి తెచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్టు భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ప్రకటించింది. ముందుగా ఇజ్రాయెల్ నుంచి భూ సరిహద్దుల ద్వారా, తరువాత భారత్కు వాయుమార్గం ద్వారా ప్రయాణ సౌకర్యం కలిస్తామని తెలిపింది.
తొలి దఫాగా జూన్ 17న ఉత్తర ఇరాన్ నుంచి అక్కడి భారత రాయబార కార్యాలయం విజయవంతంగా అర్మేనియాకు తరలించిన 110 మంది భారతీయ విద్యార్థులను భారత్కు తీసుకువస్తున్నారు.
ప్రస్తుతం సుమారు 10,000 మంది భారతీయులు ఇరాన్లో ఉన్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. వీరిలో 6,000 మంది విద్యార్థులు ఉన్నారు. భద్రతా కారణాల దృష్ఠ్యా భారతీయులను తరలిస్తున్నట్టు విదేశాంగ తెలిపింది.
MP Raghunandan Rao: పాకిస్తాన్కి బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ పది రోజుల్లో ప్రపంచ చిత్రపటంలో లేకుండా పోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పౌరులను ఇబ్బందులు పెట్టలే...ఉగ్రవాద సెంటర్లో శిక్షణ ఇస్తున్న వాటిని మాత్రమే ధ్వంసం చేశామని స్పష్టం చేశారు.
ట్రంప్ విధించిన వలస ఆంక్షల నేపథ్యంలో భారతీయ టెకీ ఉద్యోగులకు అమెరికా కంపెనీలు స్వదేశ ప్రయాణం మానుకోవాలని హెచ్చరికలు జారీ చేశాయి. వీసా పొడిగింపుపై అనిశ్చితి పెరిగిన నేపథ్యంలో, వెళ్ళిన వారికీ తిరిగి వచ్చే అవకాశం ఉండకపోవచ్చని సూచిస్తున్నారు
భారతీయ వలసదారుల పట్ల అమెరికా అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై అడిగినప్పుడు, ఈ విషయమై అమెరికాకు తమ ఆందోళనను తెలియజేశామని మిస్రీ సమాధానమిచ్చారు. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా సంప్రదింపులు కొసాగిస్తున్నామని చెప్పారు.
భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. తొలి బ్యాచ్లో 30 మంది పంజాబ్కు చెందిన వారున్నారు.