Home » Gautam Gambhir
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ వైట్వాష్పై రవిశాస్త్రి స్పందించాడు. ఒక వ్యక్తిని మాత్రమే బాధ్యుడిని చేయడం తగదని, ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఓటమికి కారణాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
87 ఏళ్లుగా ఓ అద్భుతమైన రికార్డు చెక్కు చెదరకుండా ఉంది. అదే వరుసగా ఆరు టెస్టుల్లో సెంచరీలు చేసి డాన్ బ్రాడ్మాన్ చరిత్ర సృష్టించాడు. ఈ మైలురాయికి అత్యంత చేరువైన భారత స్టార్ గౌతమ్ గంభీర్ వరుసగా ఐదు టెస్టుల్లో సెంచరీలు చేశాడు.
స్వదేశంలో వరుస టెస్టు సిరీస్ల్లో వైట్వాష్ కావడంతో ఒత్తిడిలో ఉన్న గౌతమ్ గంభీర్కు రవిశాస్త్రి కీలక హెచ్చరిక చేశాడు. పనితీరు బాగాలేకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని.. పనిని ఆస్వాదించాలని సూచించాడు.
గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక భారత్ వరుస ఓటములను చవి చూస్తుంది. సౌతాఫ్రికాతో టెస్టులో స్వదేశంలోనే వైట్ వాష్కు గురైంది. ఈ విషయంపై మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. తానే కోచ్గా ఉంటే ఓటమికి బాధ్యత తీసుకునేవాడినని తెలిపాడు.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.
ఇటీవల టీమిండియా హెచ్ కోచ్గా గౌతమ్ గంభీర్ను తప్పించాలనే డిమాండ్స్ పెరిగాయి. అయితే గౌతమ్ గంభీర్కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్గా తన పని తాను చేస్తున్నాడన్నాడు. ఓటములకు కోచ్ కన్నా కూడా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు
గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
టీమిండియాలో మూడో స్థానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తీవ్రంగా స్పందించాడు. మూడో స్థానంపై ప్రయోగాలు చేయొద్దని టీమ్ మేనేజ్మెంట్కు సూచించాడు.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. దీంతో హెడ్ కోచ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కూడా ఈ విషయంపై స్పందించాడు. కోచ్గా ప్లేయర్లకు సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వాల్సింది మీరేనని గంభీర్కు సూచించాడు.