Home » Gannavaram
Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. అదనంగా, అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై రూ. 192 కోట్ల అక్రమ లాభాల ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరో కేసు నమోదు అయింది.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు స్వాగతం పలికారు.
Gannavaram Airport: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంతలోనే విమానాశ్రయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
ప్రధాని మోదీ పర్యటనకు గన్నవరం విమానాశ్రయంలో కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో పకడ్బందీ ఏర్పాట్లు. అధికారులు సమన్వయం తీసుకొని అన్ని ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయాలని ఆదేశించారు
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా, గన్నవరం రాజీవ్ కాలనీలో కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారు. దీనిని ఆ కాలనీకి చెందిన యువకులు అడ్డుకున్నారు.
AP Highcourt: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది.
కృష్ణా జిల్లా: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఆశ్రమంలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
YSRCP Leaders: గన్నవరం పోలీస్స్టేషన్లో ఇద్దరు వైఎస్సార్సీపీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఒక్కొక్కరుగా వైసీపీ నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు.
ముఖ్యంగా ఆయనకు గుండెకాయలాంటివాడైన ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగా పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో డీటీపీ ఆపరేషన్ సత్యవర్ధన్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసును వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేత వల్లభనేని వంశీ అతని అనుచరులు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేశారని ఆరోపణలు వచ్చాయి.