Share News

Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. బెయిల్ కోసం వంశీ పిటిషన్

ABN , Publish Date - May 17 , 2025 | 11:04 AM

Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్‌ మంజూరైంది. అదనంగా, అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై రూ. 192 కోట్ల అక్రమ లాభాల ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరో కేసు నమోదు అయింది.

Vamsi: నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. బెయిల్ కోసం వంశీ పిటిషన్
Vallabhaneni Vamsi bail petition

విజయవాడ: వైసీపీ నేత (YCP Leader), గన్నవరం మాజీ ఎమ్మెల్యే (Gannavaram Ex MLA) వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)కి నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసు (Fake housing patta case)లో నూజివీడు కోర్టు (Nuzvid court) 14 రోజులు రిమాండ్‌ (14-Days Remand) విధించింది. దీంతో ఆయన ఈ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నూజివీడు కోర్టులో పిల్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం వచ్చే సోమవారం విచారణ చేపట్టనుంది. మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా హాస్పిటల్‌లో అడ్మిట్ చేయమని కోర్ట్ పోలీస్ అధికారులను ఆదేశించింది. దీంతో శనివారం వల్లభనేని వంశీని మరికొద్ది సేపటిలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించనున్నారు.


నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ..

వల్లభనేని వంశీ 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరంలో పోటీ చేశారు. విజయం కోసం బాపులపాడు మండలం కొయ్యూరు, పెరికీడు గ్రామాల్లో కొంతమందికి నకిలీ ఇళ్ల స్థలాల కేటాయింపు పత్రాలు పంపిణీ చేశారని ఆరోపిస్తూ 9 మందిపై ఆ ఏడాది అక్టోబరులో హనుమాన్‌ జంక్షన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. వారిలో వంశీ పేరు లేదు. 2024లో టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఫిర్యాదు మేరకు ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. గతంలో వంశీ హయాంలో ఇచ్చిన ఇళ్లపట్టాలపై అధికార ముద్రలు నకిలీవని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొనడంతో ఆయన్ను పదో నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం శుక్రవారం పోలీసులు విజయవాడ జైల్లో ఉన్న వంశీని నూజివీడు 2వ అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ శ్రావణి ముందు హాజరుపరిచారు.

Also Read: కార్ల పన్ను ఎగవేత కేసు.. మరో ఇద్దరిని విచారిస్తున్న డీఆర్ఐ


దెబ్బతిన్న వంశీ ఆరోగ్యం..

వంశీతో పాటు ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన్‌ రంగారావుకు న్యాయాధికారి 14 రోజుల పాటు రిమాండ్‌ విధించారు. కాగా.. నూజివీడు కోర్టుకు వచ్చినప్పటి నుంచి వంశీ తీవ్రంగా దగ్గుతూ కనిపించారు. న్యాయాధికారికి తన అనారోగ్యం గురించి చెప్పడంతో.. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్యం అందించాలని ఆమె పోలీసులను ఆదేశించారు. వంశీ భార్య పంకజశ్రీ కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ.. వంశీ ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని చెప్పారు. ఇంకోవైపు.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి బెయిల్‌ మంజూరు చేస్తూ విజయవాడ 12వ అదనపు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అయితే నూజివీడు కోర్టు రిమాండ్‌తో ఆయన జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీపై తాజాగా మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో గన్నవరం, బాపులపాడు మండలాల్లో అక్రమంగా మైనింగ్‌ చేశారని.. ఇందులో వంశీ, ఆయన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగారావు కీలకంగా వ్యవహరించాలని కృష్ణా జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు. వంశీ(ఏ-1) సహా 13 మందిని నిందితులుగా చేర్చారు. అక్రమ మైనింగ్‌ ద్వారా వంశీ రూ.192 కోట్ల అక్రమార్జన చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రీశాట్‌-1బీ ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం

ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో కదలిక

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 11:40 AM