Gannavaram Airport: గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - May 02 , 2025 | 01:41 PM
Gannavaram Airport: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాక సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్టులో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇంతలోనే విమానాశ్రయంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

కృష్ణా, మే 2: అమరావతి పునర్నిమాణ పనుల ప్రారంభోత్సవం కోసం మరికాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) గన్నవరం ఎయిర్పోర్టుకు (Gannavaram Airport) చేరుకోనున్నారు. ప్రధాని రాక సందర్భంగా విమానాశ్రయంలో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం మొత్తం పోలీసుల వలయంలోకి వెళ్లింది. ఈ క్రమంలో గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం రేగింది. కలకత్తా వెళ్లడానికి ముగ్గురు ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే వారిలో ఒక ప్రయాణికుడు ఒక్కసారిగా అరుపులు కేకలు వేయడం మొదలుపెట్టాడు. దీంతో మిగిలిన ప్రయాణికులు కంగారుపడ్డారు. వీవీఐపీ రద్దీ ఉన్న ఎయిర్పోర్టులో అలజడి చెలరేగడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ ప్రయాణికుడిని ప్రైవేటు క్యాబ్లో గన్నవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అసలు ఆ ప్రయాణికుడికి ఏం జరిగిందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు ప్రధాని రాక సందర్భంగా.. గన్నవరం ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాలలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనలో భాగంగా ఎయిర్పోర్టు వద్ద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయం వద్ద 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు కల్పించారు. గన్నవరం ఎయిర్పోర్టు మొత్తం ప్రభుత్వ అధికారుల నిఘాలో ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో కార్గో సర్వీస్ను నిలిపివేశారు. ఎయిర్పోర్ట్ ప్రధాన గేట్ దగ్గర పోలీసుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. విమాన టికెట్ ఉన్నవారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. ఎయిర్పోర్ట్కు వెళ్లేమార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.
Suresh Productions: సురేష్ ప్రొడక్షన్స్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
15 సెక్టార్లుగా బందోబస్తును విభజించారు అధికారులు. ఒక్కొక్క సెక్టార్కు ఎస్పీ/ఏఎస్పీ స్థాయి అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2:45 నిమిషాలకు తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం రానున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి వాయుసేన హెలికాప్టర్లో అమరావతిలోని సభా ప్రాంగణానికి పీఎం వెళ్లనున్నారు. రాజధాని అమరావతిలో 49 వేల కోట్లతో చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అమరావతిలో సాయంత్రం 5:15 నిమిషాలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
వెలగపూడికి పవన్
ఇదిలా ఉండగా.. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి వెలగపూడి సెక్రటేరియట్కు పవన్ బయలుదేరి వెళ్లారు. అమరావతి రిస్టార్ట్ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
ఇవి కూడా చదవండి
Kesireddy SIT Custody: రాజ్ కేసిరెడ్డిని కస్టడీలోకి తీసుకున్న సిట్
Gopi ACB Custody: రెండో రోజు ఏసీబీ కస్టడీకి గోపి
Read Latest AP News And Telugu News