Home » Bengaluru
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ప్రయాణీకులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. విమాన సర్వీసులు క్యాన్సిల్ అయితే ఏం చేయాలో ముందుగానే ఆలోచించుకుంటున్నారు. ఓ వ్యక్తి పరుపుతో ఎయిర్పోర్టుకు వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బెంగళూరుకు చెందిన మేథా క్షీరసాగర్ వివాహం నవంబర్ 23న ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్తో జరిగింది. ఇరువురూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.
రూ.7 కోట్ల సంపద ఉన్నా ఇల్లు కొనేదేలేదంటూ ఓ యువకుడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్గా మారింది. దీనిపై జనాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పొగమంచు... నిండు ప్రాణాలను బలిగొన్నది. కారులో వెళ్తున్న వారికి పొగమంచు కారణంగా రోడ్డు కనబడకపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. దీంతో భార్యాభర్తలిద్దరూ మృతిచెందారు. కాగా.. వారి మరణంతో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోగా చిన్నారులిద్దరూ అనాథలుగా మిగిలిపోయారు.
సిద్ధరామయ్య, డీకే మధ్య అధికార పంపణీ విషయంలో విభేదాలు తలెత్తడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల ఇద్దరు నేతలకు కొన్ని సూచనలు చేసింది. ముందుగా ఇరువురు నేతలు కలిసి చర్చించుకోవాలని, ఐక్యతా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.
బెంగళూరు ట్రాఫిక్ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమాజ్వాదీ ఎంపీ రాజీవ్రాయ్ పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది. ట్రాఫిక్ జామ్ను సరిచేసేందుకు ఒక్క పోలీసు కూడా కనిపించట్లేదన్న ఆయన కర్ణాటక సీఎంను ట్యాగ్ చేస్తూ నెట్టింట పోస్టు పెట్టారు.
బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. తన ఆటోలో దొరికిన డబ్బులు ఉన్న బ్యాగును బాధితుడికి అందించాడు. దీంతో డ్రైవర్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
బెంగళూరు వంటి సాఫ్ట్వేర్ సిటీలో క్యాబ్ల వాడకం చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో బెంగళూరుకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్ కఠినమైన నియమాల జాబితాను రూపొందించి దానిని సీటు వెనుక అతికించాడు. ఓ ప్రయాణికుడు దానిని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్గా మారింది.
ఓ అన్న తన తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కారులోనే ప్రాణం తీశాడు. శవాన్ని బెంగళూరులోని చెరువులో పడేశాడు.
బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై వ్యోమగామి శుభాన్షూ శుక్లా సెటైర్లు పేల్చారు. బెంగళూరు టెక్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన.. తన ప్రసంగం కంటే ఎక్కువ సమయం ట్రాఫిక్లో జర్నీ చేయాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.