Home » Bengaluru
ఈడీ దాడుల ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ టార్గెట్ చేసిందని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చీలికలు తేలేదని, పార్టీ ఐక్యంగా ఉందని మల్లికార్జున్ ఖర్గే చెప్పారు.
తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పలు ప్రశ్నలను హైకోర్టు సంధిస్తూ, వీటిపై వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. ఈ సందర్భంగా తొమ్మది ప్రశ్నలు వేసింది.
బెంగళూరు తొక్కిసలాటకు దారితీసిన క్రౌడ్ మేనేజ్మెంట్లో తమ పాత్ర ఏమీ లేదని కర్ణాటక హైకోర్టుకు ఆర్సీఎస్ఎల్ తెలిపింది. విక్టరీ సెలబ్రేషన్స్కు పరిమితంగానే పాస్లు ఉన్నాయని, ఉచిత రిజిస్ట్రేషన్ పాసుల కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తాము చాలా స్పష్టమైన ప్రకటనలు చేసినట్టు పేర్కొంది.
సుబ్రహ్మణ్యపుర పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, హతురాలు హరిణి (33) ఇద్దరు పిల్లలకు తల్లి. కొద్దికాలంగా హరిణి, యశష్ మధ్య రిలేషన్షిప్ నడుస్తోంది. దీనిపై కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడి రావడంతో బ్రేకప్ చేసుకోవాలని ఆమె అనుకుంది.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను సేకరించిన వైద్యులు, ఐదుగురికి ప్రాణదానం చేశారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానం ద్వారా శనివారం కిడ్నీ, కార్నియాను తరలించినట్టు ఎయిర్ ఫోర్స్ అధికారి ఒకరు తెలిపారు.
చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఈ ఫంక్షన్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని, కేఎస్సీఏనే నిర్వహించిందని ఆయన తెలిపారు.
బెంగళూరులో బాలిక మృతదేహం లభించిన ఘటనలో తాజాగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు వ్యక్తులు బాలిక మృతదేహం ఉన్న బ్యాగుతో అర్ధరాత్రి వేళ వీధిలో వెళుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఆర్సీబీ వంటి ప్రైవేట్ క్రికెట్ ఫ్రాంచైస్ కోసం గ్రాండ్ రెసెప్షన్కు ఆతిథ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని గిరీష్ కుమార్ ప్రశ్నించారు. ఐపీఎల్ అనేది కమర్షియల్ వెంచర్ అని, ఇందులో నేషనల్ ప్రైడ్ కంటే లాభాల ఉద్దేశమే ఉంటుందని పేర్కొన్నారు.
చిన్న స్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేసారు.
ప్రతి కేసులోనూ శాంతి భద్రతలకు ప్రత్యేకత ఉంటుందని, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఒకరు ఉండాలని అన్నారు. పోలీసు యంత్రాంగమంతా కలిసి భద్రతా చర్యలు తీసుకున్నప్పుడు కమిషనర్ను మాత్రమే బాధ్యలను చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని కిరణ్ బేడీ అన్నారు.