Home » Ashok Gajapathi Raju
గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. అశోక్గజపతిరాజుతో బాంబే హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.
గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజుని భారత ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, పోలిట్ బ్యూరో సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. అనంతరం అధికారికంగా టీడీపీ హై కమాండ్కి ఈ లేఖను పంపించారు.
అశోక్గజపతిరాజు గవర్నర్ అయినందుకు సంతోషం.. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని తెలిసి బాధ.. ఒకేసారి ఆయన అభిమానులకు కలిగిన భావోద్వేగాలివి. అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియమితులైన విషయం తెలిసి టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. తాను ఏస్థాయిలో ఉన్నా.. ఎలాంటి అత్యున్నత పదవులు చేపట్టినా విజయనగరం గడ్డను మరువనంటూ ఆయన చేసిన ప్రకటనపై జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తనను గోవా రాష్ట్రానికి గవర్నర్గా కేంద్రం నియమించడంపై అశోక్ గజపతిరాజు స్పందించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Goa Governor: గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. అలాగే హర్యానా గవర్నర్గా ఆషింకుమార్ ఘోష్ను రాష్ట్రపతి నియమించారు.
CM Chandrababu Congrats Ashok Gajapathi: మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్గా నియమితులైనందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందనలు తెలియజేశారు. గోవా గవర్నర్గా ఆ పదవికి వన్నె తేవాలని ఆకాంక్షించారు.
సీఎం చంద్రబాబు విజనరీ ఉన్ననేత.. ఆయన పార్టీని ముందుకు నడిపారని తెలుగుదేశం సీనియర్ నేత అశోక్ గజపతి రాజు కొనియాడారు. చంద్రబాబుతో పాటు తాము అందరం పార్టీని వైసీపీ నుంచి కాపాడామని అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు.
Ashok Gajapathi Raju: రుషికొండపై జగన్ నిర్మించిన అరాచక భవనం ఓ తెల్ల ఏనుగుతో సమానమని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. చట్ట వ్యతిరేకంగా ప్రజాధనాన్ని వృథా చేసి రుషికొండపై నిర్మించిన భవనాన్ని పిచ్చాస్పత్రికి కేటాయిస్తే మంచిదని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు.
సింహాచల దేవస్థానం, అనుబంధ ఆలయ అంశాలపై అధికారులతో విశాఖలో ఏపీ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింద్ర ప్రసాద్, దేవదాయ శాఖ అధికారులు, సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఎమ్మెల్యే అదితి గజపతి రాజు పాల్గొ్న్నారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మాజీ మంత్రి, సింహాచలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు.