Home » Arrest
మోతీరామ్ జాట్ 2023 నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన క్లాసిఫైడ్ సమాచారాన్ని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు (PIOs) చేరవేస్తూ గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. పీఐఓల నుంచి వివిధ మార్గాల ద్వారా అతను నిధులు అందుకుంటున్నట్టు కూడా గుర్తించామని పేర్కొంది.
Bengaluru Rave Party Bust: బెంగళూరు సమీపంలోని ఫాంహౌస్లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. 20 మంది యువకులు, 7 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో చైనా మహిళ కూడా ఉంది.
Kakani Arrest:బెంగళూరులో అరెస్టు చేసిన మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు. సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో అక్రమంగా కార్ట్జ్ ఖనిజం కొల్లగొట్టిన కేసులో పోలీసులకు దొరక్కుండా రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆయన్ను ఆదివారం బెంగళూరు శివార్లలో అదుపులోకి తీసుకున్నారు.
సోమ్ జాడకోసం గత ఐదు నెలలుగా నిఘా ఉంచామని, తీన్సుకుయా జిల్లా మార్గెరిటా ఏరియాలో అతని కదలికలు ఉన్నట్టు నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో మధ్యాహ్నం 4 గంటలకు సంయుక్త ఆపరేషన్ జరిపి పట్టుకున్నట్టు ఎస్పీ అభిజిత్ గౌరవ్ చెప్పారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు
మూడు కంపెనీల పేరుతో.. మొత్తం రూ.4.48 కోట్ల మోసానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్లోని బొల్లారం ప్రాంతానికి చెందిన జితేంద్రకుమార్ చౌబే అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో మరో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆస్తులు తనాఖా పెట్టించి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. అంతేగాక అసభ్యకర మాటలు అంటుంటారు. ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల పరిస్థితి అయితే చెప్పనలవిగాకుండా ఉంటోంది. పలువురి నుంచి వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్టు చేశారు.
ఓ కాంగ్రెస్ పార్టీ నేత చేసిన మోసాల దందా వెలుగులోకి వచ్చింది. ఈయనపై ఇప్పటికే పలు ఆరోపణలు రాగా తాజాగా.. కేపీహెచ్బీ పోలీసులు కేసు నమోదు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ముసుగులో కోట్లాది రూపాయలను పలువురి వద్దనుంచి తీసుకుని మోసాలకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కల్నల్ సోఫియా ఖురేషిని ప్రశంసిస్తున్న రైట్-వింగ్ సపోర్టర్లను మహమూదాబాద్ తన సోషల్ మీడియా పోస్ట్లో ప్రశ్నించారు. ఇదే వ్యక్తులు మాబ్ లించింగ్, ఏకపక్షంగా ఇళ్ల కూల్చివేత ఘటనల్లో బాధితులను గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని అన్నారు.
NIA: ముంబై ఎయిర్ పోర్టు దగ్గర ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జకార్తా నుంచి ముంబై వచ్చిన అబ్దుల్లా ఫయాజ్ షేక్, తల్హా ఖాన్లు గత రెండేళ్లుగా పరారీలో ఉన్నారు. ఇప్పుడు జకార్తా నుంచి ముంబై వచ్చిన వారిని విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.