Secundrabad: రైళ్లలో ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు..
ABN , Publish Date - May 21 , 2025 | 07:44 AM
నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. అంతేగాక అసభ్యకర మాటలు అంటుంటారు. ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల పరిస్థితి అయితే చెప్పనలవిగాకుండా ఉంటోంది. పలువురి నుంచి వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్టు చేశారు.

- నలుగురు హిజ్రాల అరెస్టు
సికింద్రాబాద్: రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులను వసూలు చేస్తున్న నలుగురు హిజ్రాలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10వేలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జావిద్(Secunderabad Railway SP Javid), సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నెల రోజులైనా దొరకని నేపాలీ దొంగల ఆచూకీ
కుత్బుల్లాపూర్, షాపూర్నగర్, సాయిబాబానగర్లకు చెందిన పల్లి సూర్య భానుప్రకాశ్ (24), మాదాసు విజయ్(24), చెరుకు సాయికుమార్ (31), మరో బాలుడు ఈనెల 12న వరంగల్ వెళ్లే రైలులో ప్రయాణం చేసి అదే రైలులో తిరిగి వచ్చారు. మౌలాలి స్టేషన్ దాటాకా ఓ బోగిలో ఒంటరిగా ఉన్న ప్రయాణికుడిని డబ్బులు అడిగారు. ఇవ్వకపోడంతో తిడుతూ అతనిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతని వద్ద బలవంతంగా రూ.10వేలు లాక్కొని ఒక్కొక్కరు రూ.2,300 పంచుకున్నారు.
సికింద్రాబాద్ స్టేషన్ వచ్చాక బాధితుడు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించి మంగళవారం ప్లాట్ఫాంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నేరం ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించినట్టు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నల్లమల సంపదపై రేవంత్ కన్ను: బీఆర్ఎస్
BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..
Adilabad MP Nagesh: పటాన్చెరు- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి
Read Latest Telangana News and National News