Home » Secundrabad
రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నడుపుతున్న 37 ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలు మార్పుచేసినట్లు దక్షిణ రైల్వేశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుండి జూన్ 16,19,23, 26,30 తేదీల్లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరే పినాకిని ఎక్స్ప్రెస్ (నెం:12712) 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. అంతేగాక అసభ్యకర మాటలు అంటుంటారు. ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల పరిస్థితి అయితే చెప్పనలవిగాకుండా ఉంటోంది. పలువురి నుంచి వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్టు చేశారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 8 నుంచి ఈ రైళ్లు నడుస్తాయని, అలాగే ఈ ప్రత్యేక రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని రైల్వేశాఖ తెలిపింది.
వేసవి సెలవుల నేపధ్యంలో.. మరో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే, జూన్ నెలల్లో హైదరాబాద్ నుంచి వివిధ మార్గాల్లో 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ఆ రైళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రస్తుత వేసవి సీజన్ను దృష్టిలో ఉంచుకొని ఆయా ప్రాంతాలకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లతోపాటు మరికొన్ని స్టేషన్ల నుంచి ఈ రైళ్లు బయలు దేరనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనుల్లో వేగం పెరిగింది. అభివృద్ధి పనుల్లో భాగంగా మూడు నెలల పాటు ప్లాట్ఫాంలను తాత్కాలికంగా మూసివేస్తునట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది.
సికింద్రాబాద్-రేపల్లె మధ్య నడిచే రేపల్లె ఎక్స్ప్రెస్ రైలు ఇక చర్లపల్లి నుంచి బయలుదేరనుంది. ప్రయాణికుల రద్దీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ఏర్పడ్డ ఒత్తిడి కారణంగా సికింద్రాబాద్ కు బదులు చర్లపల్లికి మార్చినట్లు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 15 నుంచి ఇది అమలులోకి వస్తుందన్నారు.
రైలులో ప్రయాణిస్తున్న బాలికపై ఓ కీచకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వీడియో కూడా తీశాడు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. బాలిక బాత్రూమ్కు వెళ్లిన సమయంలో తోటి ప్రయాణికుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వారం వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఆ పొడిగించిన రైళ్ల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు స్టాపేజీలను కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వలను జారీ చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.